Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
అల్లు అర్జున్, ఎన్టీఆర్లకు సరిపోయే స్టెప్ఫులు వద్దు
'ఆవారా', 'నా పేరు శివ', 'యుగానికి ఒక్కడు' లాంటి చిత్రాలతో తెలుగులో కూడా అభిమానుల్ని సంపాదించుకున్నారు. తాజాగా ఈయన నటించిన 'బ్యాడ్బాయ్' చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కార్తి హైదరాబాద్లో మీడియాతో ముచ్చటించారు. ఎన్నో విషయాలు ఈ సందర్భంగా ముచ్చటించారు.
''శకుని తరవాత విరామం వచ్చిన మాట వాస్తవమే. సరైన సినిమాలు కుదరక ఆలస్యం అయింది. స్వతహాగా ఇంత విరామం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు నన్ను చక్కగా ఆదరిస్తున్నారు. శకుని తర్వాత నా సినిమా రావడం ఆలస్యం అయినా 'బ్యాడ్బాయ్' ఆ లోటుని తీరుస్తుంది.'' అన్నారు.
తెలుగులో సినిమా గురించి చెప్తూ....'పూర్తి స్థాయి తెలుగు సినిమా ఎప్పుడు అని చాలామంది అడుగుతున్నారు. అందుకు తగ్గ కథ కోసం ఎదురుచూస్తున్నాను. కొంతమంది దర్శకులు కథలు కూడా వినిపించారు. కానీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. తెలుగు దర్శకులతో పని చేయాలని నాకు ఆత్రుతగానే ఉంది. కథ అవసరాన్ని బట్టి ప్రయోగాలు, సాహసాలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. కష్టమైనా సాహసం చేయడమే నాకిష్టం.'' అన్నారు.