Don't Miss!
- News గేదెల మందులమ్మేవాళ్లు వైసీపీకి సర్వే చేశారంట?
- Sports Rohit x Hardik: పదేళ్లుగా కెప్టెన్సీ చేశా.. ఎలా గెలవాలో తెలుసు- రోహిత్
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సంక్రాంతి పోటీ వద్దనుకుని ముందే వచ్చేస్తోంది.
హన్సిక, కార్తీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బిర్యాని'. ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మొదట్లో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామనుకున్నారు. కానీ సడెన్ గా ప్లాన్ మార్చి ముందే వచ్సేస్తోంది. థియోటర్స్ ఇబ్బంది,పెద్ద సినిమాల మధ్య ఈ సినిమాకు సమస్య ఎదురుతుందనే ఆలోచనలతో ఈ సినిమాని ముందుగా తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో హన్సిక జర్నలిస్ట్ గా కనిపించనుంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించి స్టిల్స్ విడుదల చేసారు. అవి అభిమానులను ఓ రేంజిలో ఆకర్షిస్తున్నాయి.
హన్సిక మాట్లాడుతూ.... ''నా అదృష్టం కొద్దీ రానున్న అన్నీ సినిమాల్లోనూ మంచి పాత్రలే చేస్తున్నాను. నాకు జర్నలిస్ట్ వృత్తి అంటే చాలా గౌరవం. ఒక్క సినిమాలోనైనా జర్నలిస్ట్గా కనిపించాలనేది నా ఆశ. త్వరలో ఆ కోరిక కూడా తీరబోతోంది. కార్తీ 'బిర్యాని' చిత్రంలో జర్నలిస్ట్గా నటిస్తున్నా. నా కెరీర్లోనే 'ది బెస్ట్' అనదగ్గ కేరక్టర్ అది'' అంది.
ఇక ఈ చిత్రంపై తమిళనాట మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులోనూ బాగానే మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు. తెలుగులో కార్తీకి ఉన్న బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వారికి నచ్చే ఎలిమెంట్స్ కలిపి మరీ నిర్మించారని చెప్తున్నారు. శకుని,బ్యాడ్ బోయ్ చిత్రాలు నిరాశ పరిచిన నేపధ్యంలో ఈ చిత్రం కార్తీకి ఊపునిస్తుందని భావిస్తున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'నాయక్' చిత్రాలు విజయాల్ని సొంతం చేసుకొన్నాయి. ఆ వూపు వేసవి వరకు కొనసాగింది. వచ్చేసారి కూడా అదే తరహా ఫలితంకోసం ఎదురు చూస్తోంది తెలుగు చిత్ర పరిశ్రమ. నెల క్రితం వరకు కూడా వచ్చే సంక్రాంతి బరిలో మహేష్బాబు, అల్లు అర్జున్ మాత్రమే నిలిచేలా కనిపించారు. ఇప్పుడు మాత్రం మరికొందరు కథానాయకులు వారిని అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు. 'హార్ట్ఎటాక్' సినిమాతో నితిన్, 'రేయ్'తో చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రాబోయే సంక్రాంతికి రాబోతున్నట్టు దర్శకనిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తే ఈసారి సంక్రాంతి బరి మరింత హోరాహోరీగా సాగేలా కనిపిస్తోంది.