Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శభాష్: బొమ్మాళికి...లండన్ డిగ్రీ
హైదరాబాద్ : సాధారణంగా హీరోయిన్స్ అంటే చదువుపై పెద్దగా దృష్టి పెట్టరు. ఏ ప్లస్ టు నో చదివి ఇండస్ట్రీకు వచ్చేసి అలా కంటిన్యూ అయిపోతూంటారు కానీ వదిలేసిన చదువుని పూర్తి చేయరనే అపప్రధ ఉంది. దాన్ని బ్రేక్ చేయటానికా అన్నట్లు బ్రదర్ ఆఫ్ బొమ్మాళి(అల్లరి నరేష్) చిత్రంలో బొమ్మాళిగా చేసి కార్తిక రీసెంట్ గా డిగ్రీ పూర్తి చేసింది. అదీ ప్రెస్టేజియస్ లండన్ యూనివర్శిటీ నుంచి. ఈ విషయాన్ని ఆమె తన అభిమానులకు ఆనందంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా తెలియచేసింది.
'జోష్' చిత్రం ద్వారా పరిచయమైన నాయిక కార్తిక. నిన్నటి తరం నాయిక రాధ కుమార్తె అయినందున మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ సినిమా కాస్త ఫ్లాపవడంతో కార్తిక పరిస్థితి సందిగ్ధంలో పడింది. నటన బాగానే చేసినా నల్ల పిల్ల అని, గ్లామరస్ గా లేదని తెలుగు దర్శకనిర్మాతలు పెదవి విరిచారు. దీంతో ఆమెకు ఆశించినంతగా అవకాశాలు రాలేదు.
తర్వాత ఆమె రంగం చిత్రంతో తమిళంలో హిట్ కొట్టింది. అంతే కాదు తర్వాత ఎన్టీఆర్ సరసన ఆమె దమ్ము చిత్రంలో చేసింది. అయితే ఆ చిత్రమూ వర్కవుట్ కాలేదు.రీసెంట్ గా మరోసారి బ్రదర్ ఆఫ్ బొమ్మాళి అంటూ కామెడీ చేసే ప్రయత్నం చేసింది. అదీ నెగిటివ్ ఫలితం ఇచ్చింది. ఇలా వరస ఫ్లాపులతో ఆమెకు పెద్దగా ఆఫర్స్ లేకుండా పోయింది. దీంతో ఆమె తల్లి రాధ రంగంలోకి దిగి ప్రయత్నాలు ముమ్మరం చేసిందట. కోలీవుడ్ లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోందట.