Don't Miss!
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- News జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
దర్శకుడుపై చెక్ బౌన్స్ కేసు.. హై కోర్టుకి
కస్తూరి రాజాపై మోసం కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పిటిషన్పై న్యాయమూర్తి ఆర్ముగస్వామి సమక్షంలో విచారణ జరిగింది. నగర పోలీసు కమిషనర్ రెండు వారాల్లో రిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. ఇక గతంలోనూ కస్తూరి రాజా తెలుగు నిర్మాత నట్టికుమార్ తో వివాదమై కేసులో ఇరుక్కున్నారు. ధనుష్ తండ్రి కస్తూరి రాజా '3' చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం తెలుగు హక్కులను పొందిన నట్టి కుమార్ నుంచి రాజా అనేక వివాదాలను, అభియోగాలను ఎదుర్కొన్నారు. అప్పట్లో ఈ చిత్రం రైట్స్ కొనుగోలు చేయటం వల్ల తానెంతో నష్టపోయానని, రాజా అందుకు పరిహారంచెల్లించాలని కోరారురు నిర్మాత నట్టి కుమార్. వీటిని తిప్పికొడుతూ, ఒప్పందం ప్రకారం ఆ చిత్రం రైట్స్ను తాను అమ్మానని, నట్టికుమార్ తనపై వెూపే అభియోగాల్లో ఎలాంటి నిజం లేదని కస్తూరి రాజా పేర్కొన్నారు.
నట్టికుమార్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని, దాంతో తానెంతో నష్టపోయానని కస్తూరి రాజా పేర్కొన్నారు. నట్టి నిరాధారమైన అభియోగాలను చూసి పోలీసులు కూడా నవ్వుకుంటున్నారు. నన్ను, నా కొడుకు ధనుష్ను, కోడల్ని వివాదాల్లోకి లాగితే, అతనిపై నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేయడం తప్ప, వేరే గత్యంతరం లేదన్నారు కస్తూరి రాజా. రాజా మాటలను ఖండిస్తూ, రాజాతో కుదుర్చుకున్న ఒప్పందానికి తగ్గ అన్ని ఆధారాలు తనవద్ద వున్నాయని, మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాటిని బహిర్గతపరుస్తానని, అతడన్నీ అబద్ధాలు చెబుతున్నాడని, నట్టి కుమార్ సమాధానం ఇచ్చారు. మళ్లీ ఈ సారి కోర్టు కేసులో కస్తూరి రాజా ఇరుక్కోవటంతో హాట్ టాపిక్ గా మారింది.