Don't Miss!
- News లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కథలు కథలు విడుదలయిన 'కథ' ఆడియో
బబ్లీ గర్ల్ జెనీలియా కథానాయికగా, నూతన నటుడు అరుణ్ అదిత్ కథానాయకుడుగా, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో 'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు' వంటి సినిమాలని తీసిన దర్శకుడు గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కథ. గుణ్ణం గంగరాజు సినిమాలే కాదు, చేసే ఫంక్షన్లు కూడా వైవిధ్యంగా వుంటాయి. అందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన 'కథ' సినిమా ఆడియో ఫంక్షన్. జస్ట్ ఎల్లో మీడియా పతాకం పై రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో ఇటీవలే హైదరాబాదులో విడుదలయింది.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఈ సినిమా టైటిల్ కథను ప్రతిబింబిచేలా ఈ కార్యక్రమానికి హాజరైన సినీప్రముఖులతో గొలుసుకట్టు కథలు చెప్పించారు. తొలుత రఘుబాబు, కీరవాణి, కె.ఎల్. నారాయణ, రాజసింహలను వేదిక పైకి పిలిచి నాలుగు పదాలు ఇచ్చి వాటి ఆధారంగా కథను అల్లమన్నారు. ఈ నలుగురిలో బాగా కథను అల్లిన రాజసింహను విజేతగా ప్రకటించారు. తర్వాత అనంత్ శ్రీరామ్, బొమ్మరిల్లు భాస్కర్, జెనీలియా, ఎన్టీఆర్ లను ఆహ్వానించి వారితో కూడా కథలు చెప్పించారు. ఇందులో ఎన్టీఆర్ విజేతగా నిలిచాడు. ఇలా ఈ కర్యక్రమం అంతా సరదా సరదాగా జరిగింది. ఈ వేడుకకి తెల్లటి గౌనులో హాజరయిన జెనీలియా అందరినీ తమ చూపును తన నుండీ మరల్చకుండా చేసింది.