Don't Miss!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
తెలుగులో రీ ఎంట్రీ గురించి కత్రీనా కైఫ్ క్లారిఫికేషన్
ఎవరైనా మంచి కథ వినిపించినా ఒప్పుకోలేని పరిస్థితి. ప్రస్తుతానికైతే తెలుగు సినిమాల్లో నటించే తీరిక లేదు అంటూ తేల్చి చెప్పేసింది కత్రానా కైఫ్. ఆమె తిరిగి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ....హిందీ తరవాత అంతటి గుర్తింపు ఉన్నది తెలుగు సినిమాలకే అని నాకు తెలుసు. అలాగే నాక్కూడా మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని ఉంది. అయితే కుదరడం లేదు. వరుసగా హిందీ చిత్రాలతోనే సరిపోతోంది. 'మల్లీశ్వరి' తరవాత 'అల్లరి పిడుగు' ఒక్కటే చేశాను. చేసినవి రెండు చిత్రాలే అయినా తెలుగు సినీ పరిశ్రమను ఎప్పుడూ మర్చిపోను. ఇక్కడ దర్శకనిర్మాతలు చూపించిన ఆదరణ అంతలా మనసుకి హత్తుకుపోయింది అంది. ఇక కత్రీనా రీసెంట్ గా 'తీస్ మార్ఖాన్' సినిమాలో చేసిన 'షీలాకీ జవానీ' పాట సినిమా ఫ్లాప్ అయినా పాట సూపర్ హిట్టయింది. ప్రస్తుతం ఆమె లక్స్ సబ్బుకి ప్రచారకర్తగా మారింది.