Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఆ లేడీ డైరక్టర్ నన్ను మోసం చేసింది
ఆమెని నమ్మి సినిమా చేశాను. ఆమె చేసిన తప్పిదానికి నేను బలై పోయాను. ఒక విధంగా ఆ చిత్ర దర్శకురాలు ఫరాఖాన్ నన్ను మోసం చేసింది అని చెప్పాలి అంటూ బాధ పడుతోంది కత్రనాకైఫ్. హిందీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న ఈమె నటించిన తీస్ మార్ ఖాన్ చిత్రం ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో ఆమె చేసిన షీలాకీ జవానీ. పాట మాత్రం పెద్ద హిట్టయింది. అలాగే ఫరాఖాన్ ఆ సినిమా కథ చెప్పి ఊహల్లోనే నా చేత మేడలు కట్టించింది.
తీరా విడుదలయ్యాక అది పెద్ద ప్లాప్ అని తేలి నా ఆశలన్నీ కూలిపోయాయి. ఇపుడిప్పుడే ఆ షాక్ నుంచి కోలుకుంటున్నాను అంటూ కత్రినా తన ఆవేదనను వ్యక్తం చేస్తోంది. అలాగే తాను ఓ నిర్ణయం తీసుకున్నానని, ఇకపై ఎప్పుడూ ఓ వ్యక్తిని నమ్మి సినిమా చేయననీ, కేవలం కథకే తన మొదటి ప్రాధాన్యతనిస్తానని, సినిమాపై నమ్మకం కుదిరాకే గ్రీన్సిగ్నల్ ఇస్తానని అంటోంది కత్రినాకైఫ్.