Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
న్యూ ఇయిర్ రాత్రి ఆ స్టార్ హీరోయిన్స్ రేట్లు
న్యూ ఇయిర్ వస్తోందంటే హీరోయిన్స్ కి అందునా ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ కి భలే డిమాండ్. వారిలో ఎక్కువ డిమాండ్ సంపాదించి,ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్న ముద్దుగుమ్మలు ముగ్గురే. వాళ్లే కత్రినాకైఫ్,కరీనాకపూర్,ప్రియాంకా చోప్రా. ముందుగా వీరిలో కత్రినాకైఫ్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఆమెను రెండు కోట్లు దాకా ఇచ్చేందుకు క్లబ్ నిర్వాహకులు వెంటబడుతున్నట్లు సమాచారం. అయితే ఆమె సూపర్ హిట్ ఐటం సాంగ్ షీలా కీ జవానీని స్టేజ్ పై డాన్స్ చేయాలి. ఈ కార్యక్రమంలో ఆమె కేవలం 15 నిమిషాలు మాత్రమే వుంటుంది. అయితే ఆమెకు ఆ రేటు ఇవ్వటానకి విపరీతమైన పోటీ ఏర్పడింది. అయితే ఇప్పటివరకూ కత్రినా ఎవరకీ హామీ ఇవ్వలేదు. ఎక్కువ ఎవరు ఆఫర్ చేస్తే వారితో కమిటవ్వటానికి ఆమె వెయిట్ చేస్తోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇక ఆ తర్వాత స్ధానం కరీనా కపూర్ పొందింది. ఆమె కూడా రాత్రి మూడు పాటలు డాన్స్ చేయటానికి మూడు కోట్లు దాకా డిమాండ్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ కావటంతో ఆమె ఓకే అంటే ఆమె పేరు చెప్పి ఆ రాత్రి రేటు విపరీతంగా పెంచవచ్చునని క్లబ్ నిర్వాహకులు ఎంతైనా ఇవ్వటానికి సిద్దపడుతున్నారు. ఆ తర్వాత స్ధానం ప్రియాంక చోప్రాది. ఆమె కు కోటిన్నర దాకా ఇవ్వటానికి ముందుకొస్తున్నారు. అయితే ఈ ముగ్గురూ ఇంకా ఏ హోటల్ వారికీ సైన్ చెయ్యలేదని,ఎవ్వరు ఎక్కువ ఇస్తే వారితో వెళ్లటానకి సిద్దంగా ఉన్నారు. మరి ఎవరా అదృష్టవంతులో చూడాల్సిందే.