twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యువరాణి కావాలన్నదే నా డ్రీమ్: కత్రినాకైఫ్

    By Sindhu
    |

    బాలీవుడ్‌ లో అత్యధిక సినిమాల్లో నటిస్తూ యమబిజీగా వున్న కత్రినా కైఫ్‌ కూ రాజకుమారి పాత్రలో నటించాలనివుందట. ఆ మధ్య ప్రకాష్‌ఝా రూపొందించిన 'రాజ్‌ నీతి" చిత్రంలో రాజకీయ నాయకురాలిగా కనిపించి విజయం సాధించిన కత్రినాకైఫ్ కొన్నేళ్ళ క్రితం తెలుగులో వెంకటేష్ సరసన 'మల్లీశ్వరి" చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో యువరాణిగా కనిపించి తెలుగు ప్రేక్షకులని కత్రిన అలరించిన విషయం తెలిసిందే. అయితే అది పూర్తినిడివిగల పాత్ర కాకపోవడంతో సంతృప్తి చెందని కత్రినాకైఫ్‌ కు యువరాణి తరహా పాత్రలో నటించాలనే కోరిక మిగిలి పోయిందట.

    అయితే ఈ మధ్యే తెలుగు చిత్రం 'మగధీర"లో కాజల్ అగర్వాల్ నటించిన యువరాణి మిత్ర వింద పాత్ర గురించి తెలుసుకున్న కత్రినా ఆ పాత్రలో నటించాలని ఆత్రంగా ఎదురు చూస్తోందట. ఈ పాత్ర గురించి కత్రినా మాట్లాడుతూ' మగధీర" చిత్రంలో కాజల్ నటించిన యువరాణి మిత్రవింద పాత్ర నన్నెంతగానో ఆకట్టుకుంది. ఈ తరహా పాత్రలో నటించాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. ఇక విధంగా చెప్పాలంటే ఇది నా డ్రీమ్‌ రోల్. కాకపోతే ఈ పాత్రకు కొంచెం యాక్షన్ మిళితం చేస్తే ఆ పాత్ర మరింత బాగుండేది" అంటోంది కత్రినా కైఫ్.

    ప్రస్తుతం సోయగాల సుందరి కత్రినా కైఫ్ 'ధూమ్-3' హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. 'ధూమ్' సీరీస్ మూడో భాగంలో కథానాయిక ఎంపిక కోసం చిత్ర దర్శక నిర్మాతలు పెద్ద కసరత్తే చేశారు. మొదట్లో ప్రియాంకా చోప్రాను, దీపికా పదుకొనేను అనుకున్నారు. తర్వాత, కొత్త అమ్మాయిని పరిచయం చేద్దామని కూడా అనుకున్నారు. అయితే, చివరికి నేటి బిజీ తార కత్రినాకే ఓటేశారు.

    ఇందులో నెగటివ్ క్యారెక్టర్ని అమీర్ ఖాన్ పోషిస్తాడు. మిగతా పాత్రల్లో మామూలుగా అభిషేక్ బచ్చన్, ఉదయ చోప్రా నటిస్తారు. విజయ కృష్ణ ఆచార్య (విక్టర్) డైరెక్షన్లో దీనిని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. విశేషమేమిటంటే, అమీర్ ఖాన్, కత్రినా తొలిసారిగా ఇందులో జంటగా నటించడం! 'ధూమ్' లో ఇషాడియోల్, 'ధూమ్ -2' లో ఐశ్వర్యా రాయ్ కథానాయికలుగా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడీ పార్ట్ 3 ఈ డిసెంబర్లో ప్రారంభమై, వచ్చే ఏడాది క్రిస్మస్ కి రిలీజ్ అవుతుందని సమాచారం.

    English summary
    But it seems that Katrina, who is relatively newer in the industry, is taken as seriously as veteran actress Aishwarya Rai Bachchan. Reportedly Katrina, who has signed on to Dhoom 3, managed to get Aditya Chopra to agree to her terms that two of the former leading ladies (Esha Deol and Bipasha Basu) of the YRF franchise had no say in. Aditya seems to have given in to Kat's terms, just like he did for Ash in Dhoom 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X