Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యువరాణి కావాలన్నదే నా డ్రీమ్: కత్రినాకైఫ్
బాలీవుడ్ లో అత్యధిక సినిమాల్లో నటిస్తూ యమబిజీగా వున్న కత్రినా కైఫ్ కూ రాజకుమారి పాత్రలో నటించాలనివుందట. ఆ మధ్య ప్రకాష్ఝా రూపొందించిన 'రాజ్ నీతి" చిత్రంలో రాజకీయ నాయకురాలిగా కనిపించి విజయం సాధించిన కత్రినాకైఫ్ కొన్నేళ్ళ క్రితం తెలుగులో వెంకటేష్ సరసన 'మల్లీశ్వరి" చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో యువరాణిగా కనిపించి తెలుగు ప్రేక్షకులని కత్రిన అలరించిన విషయం తెలిసిందే. అయితే అది పూర్తినిడివిగల పాత్ర కాకపోవడంతో సంతృప్తి చెందని కత్రినాకైఫ్ కు యువరాణి తరహా పాత్రలో నటించాలనే కోరిక మిగిలి పోయిందట.
అయితే ఈ మధ్యే తెలుగు చిత్రం 'మగధీర"లో కాజల్ అగర్వాల్ నటించిన యువరాణి మిత్ర వింద పాత్ర గురించి తెలుసుకున్న కత్రినా ఆ పాత్రలో నటించాలని ఆత్రంగా ఎదురు చూస్తోందట. ఈ పాత్ర గురించి కత్రినా మాట్లాడుతూ' మగధీర" చిత్రంలో కాజల్ నటించిన యువరాణి మిత్రవింద పాత్ర నన్నెంతగానో ఆకట్టుకుంది. ఈ తరహా పాత్రలో నటించాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. ఇక విధంగా చెప్పాలంటే ఇది నా డ్రీమ్ రోల్. కాకపోతే ఈ పాత్రకు కొంచెం యాక్షన్ మిళితం చేస్తే ఆ పాత్ర మరింత బాగుండేది" అంటోంది కత్రినా కైఫ్.
ప్రస్తుతం సోయగాల సుందరి కత్రినా కైఫ్ 'ధూమ్-3' హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. 'ధూమ్' సీరీస్ మూడో భాగంలో కథానాయిక ఎంపిక కోసం చిత్ర దర్శక నిర్మాతలు పెద్ద కసరత్తే చేశారు. మొదట్లో ప్రియాంకా చోప్రాను, దీపికా పదుకొనేను అనుకున్నారు. తర్వాత, కొత్త అమ్మాయిని పరిచయం చేద్దామని కూడా అనుకున్నారు. అయితే, చివరికి నేటి బిజీ తార కత్రినాకే ఓటేశారు.
ఇందులో నెగటివ్ క్యారెక్టర్ని అమీర్ ఖాన్ పోషిస్తాడు. మిగతా పాత్రల్లో మామూలుగా అభిషేక్ బచ్చన్, ఉదయ చోప్రా నటిస్తారు. విజయ కృష్ణ ఆచార్య (విక్టర్) డైరెక్షన్లో దీనిని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. విశేషమేమిటంటే, అమీర్ ఖాన్, కత్రినా తొలిసారిగా ఇందులో జంటగా నటించడం! 'ధూమ్' లో ఇషాడియోల్, 'ధూమ్ -2' లో ఐశ్వర్యా రాయ్ కథానాయికలుగా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడీ పార్ట్ 3 ఈ డిసెంబర్లో ప్రారంభమై, వచ్చే ఏడాది క్రిస్మస్ కి రిలీజ్ అవుతుందని సమాచారం.