బాలకృష్ణను ఇంకా మరిచిపోని కత్రినా కైఫ్!

By Bojja Kumar

Katrina Kaif-Balakrishna
హైదరాబాద్: హీరోయిన్ కత్రినా కైఫ్....అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది 'మల్లీశ్వరి' సినిమానే. ఈ చిత్రంలో ఆమెకు నటన పరంగా పెద్దగా మార్కులు పడక పోయినా.....ఆమె అందానికి మాత్రం ఫుల్ మార్కులు పడ్డాయి. ఆ తర్వాత కత్రినా కైఫ్ తెలుగులో బాలయ్య సరసన 'అల్లరి పిడుగు' చిత్రంలో నటించినా....ఆ సినిమా ఎవరికీ గుర్తులేదు.

అయితే కత్రినా కైఫ్ మాత్రం బాలకృష్ణ‌ను, ఆయనతో నటించిన 'అల్లరి పిడుగు' సినిమాను బాగా గుర్తు పెట్టుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విలేకరులు ఆమెను.... 'మల్లీశ్వరి' తర్వాత తెలుగులో మళ్లీ ఏ సినిమా చేయలేదు. తెలుగులో మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారు? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అందరూ ఆశ్చర్య పడేలా సమాధానం ఇచ్చింది కత్రినా.

'నేను మల్లీశ్వరి తర్వాత తెలుగులో రెండో సినిమా చేసాను. బాలకృష్ణతో అల్లరి పిడుగు చిత్రంలో నటించాను' అని సమాధానం ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో మరిచిపోయిన ఆ ప్లాపు సినిమా గురించి కత్రినా ఇంకా గుర్తు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రస్తుతం కత్రినా కైఫ్ బాలీవుడ్లో టాప్ 3 హీరోయిన్లలో ఒకరుగా తన హవా సాగిస్తోంది. ఆమె రెమ్యూనరేషన్ రూ. 5 నుంచి 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఒక వేళ కత్రినా కైఫ్ తెలుగులో నటించడానికి ఒప్పుకున్నా, ఆమెకు అంత రెమ్యూనరేషన్ ఇచ్చేంత సాహసం ఏ నిర్మాత చేస్తాడు?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X