Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
బాలయ్య 'అల్లరి పిడుగు' హీరోయిన్ కి మళ్ళీ మనసైంది
మల్లీశ్వరి, అల్లరి పిడుగు చిత్రాల్లో నటించిన హీరోయిన్ కత్రినాకైప్ ఆ తర్వాత కనపడలేదు. రెమ్యునేషన్ ఎక్కువనించటం ఓ కారణమైతే ఆమె నటన సరిగ్గా రాదనే విమర్శలు ఇక్కడ వర్కవుట్ కానివ్వలేదు. దానికి తగ్గట్లుగానే కత్రినా కైఫ్ ఆ తర్వాత ఇక్కడ పనిచేయటానికి ఉత్సాహం చూపించలేదు. తాజాగా ఆమె నిర్ణయం మార్చుకున్నట్లుంది. ఆమె మాట్లాడుతూ...నేను కొన్ని దక్షిణాది సినిమాలు చేశాను. నా కెరీర్కు ఆ సినిమాలు కానీ... నేను ఆ సినిమాలకు కానీ ఎందుకూ ఉపయోగపడలేదు. బహుశా విదేశాల్లో పెరిగిన కారణంగా దక్షిణాది సినిమాల్లో ఇమడలేకపోయానేమో..పైగా నాకప్పుడు నటనలో పరిపక్వత కూడా తక్కువ. ఇప్పుడు నటనలో బాగానే పరిణతి సాధించాను. మళ్లీ మంచి అవకాశం వస్తే మాత్రం వదులుకోను' అంటూ తన మనసులో మాట బైటపెట్టింది. అంటే...త్వరలోనే కత్రినాకైఫ్ మళ్ళీ ఇక్కడ వారిని అలరిస్తుందన్నమాట. ఇంతకీ ఏ హీరో ప్రక్కన ఆమె చేయనుందో చూడాలి.