Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
భారతీయత నిరూపించుకోవడం కోసం కత్రినా పాట్లు
సంగం భారతీయురాలు మాత్రమే అనే విమర్శలు ఎదుర్కొంటున్న....బాలీవుడ్ తార క్రతినా కైఫ్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ విమర్శలను తిప్పకొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ సరిహద్దుల్లో పని చేస్తున్న జవాన్లను కలిసి వారితో మమేకమైంది. వారు రోజు చేసే కార్య్రకమాల్లో పాలు పంచుకుంది. ఎకె 47 రైఫిల్ఎక్కుపెట్టడంతో పాటు బైక్ రైడింగ్, రోప్ ఆదారంగా గోడలు ఎక్కడం లాంటివి చేసి జనవాన్లను ఉత్సాహ పరిచింది. ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూ....దేశంలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారంటే వారు జనవాన్ల తర్వాతే అని చెప్పుకొచ్చింది. తాను నిఖార్సయిన భారతీయురాలినని, దేశం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేసింది.
లండన్ లో పుట్టి పెరిగిన కత్రినాకైఫ్ తండ్రి ఇండియన్ కాగా, తల్లి బ్రిటిష్ జాతీయురాలు. ఈ నేపథ్యంలో ఆమె పూర్తి భారతీయురాలు కాదంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య కత్రినా...రాహుల్ గాంధీ కూడా నా టైపే కాదా? నాపై మత్రమే అలాంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారంటూ ఓ టీవీ కార్యక్రమంలో పశ్నించిన విషయం తెలిసిందే.