Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సినీనటి కుమార్తె అదృశ్యం.. కేసు నమోదు
కాగా ఆమె అంతకుముందు ఓ పాన్ బ్రోకర్స్ సంస్థలో తన వద్దనున్న గొలుసును, ఉంగరాన్ని తాకట్టుపెట్టి రూ.83వేలను తీసుకువెళ్ళింది. అనంతరం అమీర్పేటలోని తమకు పరిచయం ఉన్న ఓ సూపర్ మార్కెట్ నిర్వాహకులకు కారును, పాన్బ్రోకర్ చిట్టీలను అప్పగించి ఓ యువకుడితో కరీంనగర్ వెళ్లి అక్కడ అతడిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఈ సమాచారం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసు బృందం కరీంనగర్ వెళ్లి ఆమెను, ఆ యువకుడిని నగరానికి తీసుకువస్తున్నట్లు సమాచారం.
మాధురి కరీంనగర్ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకుంది. మాధురి తన కారు డ్రైవర్ రాజ్కుమార్ను ప్రేమవివాహం చేసుకోవటం అంతటా చర్చనీయాంసంగా మారింది. విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్సై రాజేంద్రప్రసాద్ ఆలయానికి వె ళ్లి, కొత్త దంపతులను అదుపులోకి తీసుకున్నారు. మాధురిని హైదరాబాద్కు, రాజ్కుమార్ను పెద్దపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
మాధురి బంధువుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజాగుట్ట ఠాణాలో రాజ్కుమార్పై కేసు నమోదైంది. దీంతో పంజాగుట్ట పోలీసులు పెద్దపల్లికి వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు. ఈ సందర్భంగా మాధురి మీడియాతో మాట్లాడుతూ.. తమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించరనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి, వివాహం చేసుకున్నామని తెలిపారు.