Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నయీం ఎన్కౌంటర్లో ఖతం అయ్యేంతవరకూ...
నయీమ్ చిన్నప్పటినుంచి ఎన్కౌంటర్లో మరణించిన వరకూ జరిగిన అన్ని సంఘటనల్ని తెరపై చూపిస్తున్నామని కట్టా రాంబాబు తెలిపారు.
గ్యాంగ్స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఖయ్యుం భాయ్' దాదాపు పూర్తికావొచ్చింది. వచ్చెనెల 5వ తేదీకి షూటింగ్ పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టడానికి రెడీ అవుతున్నారు. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు నటిస్తున్న ఈ చిత్రంలో పోలీసు అధికారి పాత్రను తారకరత్న పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మ్యూజిక్ నందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడిగా భరత్ వ్యవహరిస్తున్నారు.
ఇటీవల కట్టా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ 'భరత్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆయనతో 25 ఏళ్ల స్నేహ బంధం నాది అని తెలిపారు. అలాగే నందమూరి ఫ్యామిలీతోనూ చక్కని అనుబంధం ఉందని తెలిపారు. నయీమ్ చిన్నప్పటినుంచి ఎన్కౌంటర్లో మరణించిన వరకూ జరిగిన అన్ని సంఘటనల్ని తెరపై చూపిస్తున్నామన్నారు. గోపి మోహన్ - కోన వెంకట్ పర్యవేక్షణలో భవానీ ప్రసాద్ మాటలు అందించారు.