Don't Miss!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రిలీజ్ రోజే ఆ సినిమా చూస్తా : కేసీఆర్
థర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల మానవహక్కులకు, పర్యావరణానికి ఎలా నష్టం కలుగుతుందో అద్భుతంగా చూపించారని తెలిపారు. సినిమాలో శ్రీకాకుళం జిల్లా సోంపేట ఉద్యమకారులే హీరోలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విలన్లు అని అన్నారు. సామాజిక అంశాలను మానవీయ కోణంలో చూసే కళాకారుడు నారాయణమూర్తి అని కేసీఆర్ కొనియాడారు. సెప్టెంబర్ 14న 'పీపుల్స్ వార్' సినిమా విడుదల అవుతుందని చెప్పారు.
ఈ సినిమా గురించినారాయణ మూర్తి మాట్లాడుతూ...'' శ్రీకాకుళం జిల్లా సోంపేట, కాకరాపల్లి తదితర గ్రామాల ప్రజలు థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని ఎంచుకొని రాసుకొన్న కథే ఇది. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన గున్నా జోగారావు పాత్రలో శ్రీహరి నటిస్తున్నారు. పర్యావరణాన్ని బూడిద కుప్పలుగా మార్చేసే ప్రాజెక్టులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలే ఈ చిత్రంలో ప్రతినాయకులు అన్నారు.
నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో శ్రీహరి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషించారు.