Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లేడీ నిర్మాత అరెస్ట్: అతిపెద్ద మోసం వెలుగులోకి, అప్పటి వరకు పోలీస్ కస్టడీలోనే...
క్రిఅర్జ్ ఎంటర్టెన్మెంట్స్ అధినేత, బాలీవుడ్ నిర్మాత ప్రేర్నా అరోరా ఇబ్బందుల్లో పడింది. సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ను హీరోయిన్గా పరియం చేస్తూ 'కేదార్నాథ్' చిత్రాన్ని తెరకెక్కించిన ప్రేర్నా... ఈ సినిమాకు సంబంధించిన వివాదంలో అరెస్ట్ అయ్యారు. ఆమె రూ. 16 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరో బాలీవుడ్ నిర్మాత వశు భగ్నానీ, పూజా ఎంటర్టెన్మెంట్స్ వారు ఆమెపై కేసు వేశారు. 'కేదార్నాథ్' మూవీ రైట్స్ రోనీ స్క్రూవాలాకు అప్పగించడంతో ఆమెపై ఈ ఏడాది జూన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. చట్ట విరుద్ధంగా ఈ రైట్స్ వేరొకరికి బదిలీ చేయడం వల్ల తాము రూ. 16 కోట్లు నష్టపోయినట్లు వారు ఆరోపిస్తున్నారు.
‘కేదార్నాథ్' మూవీ
సారా అలీ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ జంటగా తెరకెక్కిన ‘కేదార్నాథ్' చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ చిత్రానికి అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించారు. కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో జరిగే ఒక ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు.
పట్టించుకోని అధికారులు.. బాంబే హైకోర్టు వరకు వెళ్లిన కేసు
‘కేదార్నాథ్' రైట్స్ మొదట తమకు ఇచ్చారని, ఆ తర్వాత ఒప్పందాన్ని తోసి పుచ్చుతూ చట్టవిరుద్దంగా రైట్స్ రోనీ స్క్రూవాలాకు ఇచ్చారని... వశు భగ్నానీ, పూజా ఎంటర్టెన్మెంట్స్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోక పోవడంతోవారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
ప్రేర్నా అరెస్ట్, అప్పటి వరకు కష్టడీలోనే
ఈ నేపథ్యంలో ప్రేర్నా అరోరాను అరెస్ట్ చేసిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు... ఆమెను డిసెంబర్ 10 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి మూడు రోజులు ఆమెను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ పలు వివాదాల్లో ప్రేర్నా
గతంలోనూ ప్రేర్నా అరోరా పలు వివాదాల్లో చర్చనీయాంశం అయ్యారు. ఈ ఏడాది మే నెలలో ‘పరమాణు' సినిమా విడుదల విషయంలో నటుడు జాన్ అబ్రహం, ప్రేర్నా అరోరా మధ్య వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే.
ప్రేర్నా నిర్మించిన సినిమాలు
క్రిఅర్జ్ ఎంటర్టెన్మెంట్స్ అధినేతగా ఆమె... పాడ్మ్యాన్, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా, రుస్తుం లాంటి చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇపుడు ‘కేదార్నాథ్' సినిమా నిర్మించారు.