Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హరికృష్ణని ఆపేసిన ట్రాఫిక్ పోలీస్.. సీఎం కొడుకు అయినా కూడా, ఏం జరిగిందంటే!
నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. నేడు ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినీరాజకీయ ప్రముఖులంతా హరికృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. హరికృష్ణతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
సంగీత దర్శకుడు కీరవాణి ట్విట్టర్ ద్వారా హరికృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాన్ని పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్ లో హరికృష్ణ కారులో వెళుతున్నారు. ముషీరాబాద్ లో సిగ్నల్ జంప్ చేశాడనే కారణంతో ట్రాఫిక్ పోలీస్ ఆయన వాహనాన్ని ఆపేశారు.
తాను ఆపింది ముఖ్యమంత్రి తనయుడి వాహనం అని ఆ పోలీసుకు తెలియదు. హరికృష్ణకు ఆ పోలీస్ జరిమానా విధించాడు. తప్పు తనదే కావడంతో హరికృష్ణ జరిమానా కట్టే అక్కడి నుంచి వెళ్లారు. తాను ముఖ్యమంత్రి కుమారుడిని అనే విషయం ఆ తరువాత కూడా అతడికి చెప్పలేదు. భేషజాలు లేని మనిషి హరికృష్ణ అని కీరవాణి ట్వీట్ చేశారు.
🙏🏿🙏🏿🙏🏿 pic.twitter.com/CCuf9gJUt3
— mmkeeravaani (@mmkeeravaani) August 30, 2018