twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ హీరోయిన్ ..ఈసారి జగపతి బాబు సరసన

    By Srikanya
    |

    ఎన్టీఆర్ తో ఆది చిత్రంలో హీరోయిన్ గా చేసిన కీర్తి చావ్లా ఆ తర్వాత కనిపించలేదు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె జగపతిబాబు సరసన ఓ చిత్రంలో చేస్తోంది.సాధ్యం పేరుతో రెడీ అవనున్న ఈ చిత్రంలో మొదటి హీరోయిన్ గా ప్రియమణి చేస్తోంది. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. ఇక ప్రియమణి,జగపతిబాబు కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఇది. ఇంతకుముందు వీరిద్దరూ పెళ్ళయిన కొత్తలో చిత్రంలో చేసారు. ఆ తర్వాత మదన్ రూపొందిస్తున్న ప్రవరాఖ్యుడు చిత్రంలో చేసారు. మొన్నే ఆడియో రిలీజైంది. త్వరలో రిలీజుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సాధ్యం చిత్రంలో కీర్తీ చావ్లా ఓ గ్లామర్ పాత్రను పోషిస్తున్నట్లు నిర్మాతలు కుమార్ బ్రదర్శ్ చెప్తున్నారు. ఆది చిత్రం హిట్టయినా వినాయిక్, ఎన్టీఆర్ లకు పేరు వచ్చింది కానీ కీర్తి చావ్లాను పట్టించుకున్నవారు లేరు. అయితే ఈ సారన్నా ఈ చిత్రంతో అందరి దృష్టిలో పడి మరిన్ని ఆఫర్స్ సంపాదిస్తుందని ఆశిద్దాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X