Don't Miss!
- News ఊపిరి పీల్చుకున్న ఉద్యాననగరి..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఎన్టీఆర్ హీరోయిన్ ..ఈసారి జగపతి బాబు సరసన
ఎన్టీఆర్ తో ఆది చిత్రంలో హీరోయిన్ గా చేసిన కీర్తి చావ్లా ఆ తర్వాత కనిపించలేదు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె జగపతిబాబు సరసన ఓ చిత్రంలో చేస్తోంది.సాధ్యం పేరుతో రెడీ అవనున్న ఈ చిత్రంలో మొదటి హీరోయిన్ గా ప్రియమణి చేస్తోంది. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. ఇక ప్రియమణి,జగపతిబాబు కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఇది. ఇంతకుముందు వీరిద్దరూ పెళ్ళయిన కొత్తలో చిత్రంలో చేసారు. ఆ తర్వాత మదన్ రూపొందిస్తున్న ప్రవరాఖ్యుడు చిత్రంలో చేసారు. మొన్నే ఆడియో రిలీజైంది. త్వరలో రిలీజుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సాధ్యం చిత్రంలో కీర్తీ చావ్లా ఓ గ్లామర్ పాత్రను పోషిస్తున్నట్లు నిర్మాతలు కుమార్ బ్రదర్శ్ చెప్తున్నారు. ఆది చిత్రం హిట్టయినా వినాయిక్, ఎన్టీఆర్ లకు పేరు వచ్చింది కానీ కీర్తి చావ్లాను పట్టించుకున్నవారు లేరు. అయితే ఈ సారన్నా ఈ చిత్రంతో అందరి దృష్టిలో పడి మరిన్ని ఆఫర్స్ సంపాదిస్తుందని ఆశిద్దాం.