Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కొత్త డైరెక్టర్తో కమిటైన కీర్తి సురేష్.. జాతీయ అవార్డు దక్కిన తర్వాత!
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రిగా అబ్బురపరిచే నటన కనబర్చిన ఈమె ఇటీవలే తన బెస్ట్ హీరోయిన్ కేటగిరీలో జాతీయ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకున్న కొత్త డైరెక్టర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కీర్తి సురేష్.
ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాలు, తమిళంలో ఓ చిత్రం అదేవిధంగా మలయాళంలో మోహన్లాల్ చిత్రంలో నటిస్తున్న కీర్తి తాజాగా ఈశ్వర్ కార్తీక్ అనే కొత్త డైరెక్టర్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. మరికొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని 'పిజ్జా, పేట' చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించనున్నాడు. థ్రిల్లర్ జోనర్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా అన్ని హంగులతో ఈ సినిమా రూపొందించనున్నారు. ఈ సినిమాలో కీర్తీ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుందని సమాచారం.
ఈ సినిమాను తమిళంలో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. కాగా ఓ థ్రిల్లర్ జోనర్ సినిమాలో నటించడం తనకెంతో ఆనందంగా ఉందని కీర్తి సురేశ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. నటనా ప్రతిభతో జాతీయ అవార్డు దక్కించుకున్న ఈమె సౌత్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. రానున్న రోజుల్లో కీర్తి సురేష్కి మరిన్ని అవకాశాలు వెల్లువెత్తే అవకాశముందని అంటున్నారు.