Don't Miss!
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అటు పవన్ తో చేస్తూనే ఇంకో క్రేజీ ఆఫర్: శర్వానంద్ తో కీర్తి సురేష్?
ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సరసన నటిస్తున్న కీర్తి సురేష్ ప్రకాష్-శర్వా సినిమాలో కథానాయికగా చేయబోతోందట.
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. తొలి సినిమాతోనే ఘనవిజయం సాధించిన ఈ బ్యూటీ, నాని సరసన నేనులోకల్ తో మరోసారి ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళనాట కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమాలో నటిస్తున్న కీర్తి మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సరసన నటిస్తున్న కీర్తి సురేష్ ప్రకాష్-శర్వా సినిమాలో కథానాయికగా చేయబోతోందట. ప్రకాష్ సినిమాలు ఆడకపోయినా.. ఆయన సినిమాల్లో హీరోయిన్ల పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది.
'అనగనగా ఓ ధీరుడు'లో శ్రుతి హాసన్ ను చాలా అందంగా చూపించి.. ఆమెపై ఇండస్ట్రీ జనాల దృష్టి పడేలా చేశాడు ప్రకాష్. ఇక 'సైజ్ జీరో'తో అనుష్కను కూడా సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు. మరి కొత్త సినిమాలో కీర్తికి ఎలాంటి రోల్ ఇచ్చాడో.. ఆమెనెలా ఉపయోగించుకుంటాడో చూడాలి.