Don't Miss!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- News చిలుకూరు బాలాజీ ఆలయానికి గరుడ ప్రసాదం కోసం భక్తుల రష్.. అసలేమిటీ గరుడ ప్రసాదం?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
పవన్ కళ్యాణ్ సైలెన్స్ వెనుక ఉన్న ఆ విషయం చాలామందికి తెలియదు: కీర్తీ సురేష్
ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి...పవన్ కల్యాణ్ గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ చిత్రంలో పవన్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన కీర్తి సురేష్ ఇంకో ఆసక్తిక
పవర్ స్టార్ పవన్కల్యాణ్, త్రివిక్రమ్ ల కాంబోలో రాబోతోన్న "అజ్ఞాతవాసి" చిత్రం పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. సోమవారం విడుదలైన ఈ చిత్రం ఫస్ట్లుక్.... నేషనల్ వైడ్ లో ట్రెండింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ సరసన తొలిసారిగా కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయెల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి తొలిసారిగా తానే తెలుగులో డబ్బింగ్ చెప్పింది కీర్తి సురేశ్.
Recommended Video
వరుస సినిమాలతో బిజీ
ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న మలయాళీ భామ కీర్తి సురేష్ తొలిసారి తెలుగు డబ్బింగ్ చెప్పింది. నేను శైలజ చిత్రంతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం మహానటి, పవన్ 25వ సినిమా చేస్తుంది. పవర్ స్టార్ సరసన నటించే ఆఫర్ ఈ అమ్మడికి రావడంతో ఎగిరి గంతేసినంత పని చేసింది.
తొలిసారి తెలుగు డబ్బింగ్
అయితే ఈ సినిమా కోసం తొలిసారి తెలుగు డబ్బింగ్ చెబుతుంది కీర్తి. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని చెబుతూ డబ్బింగ్ రూమ్లో కూర్చొని దిగిన ఫోటోని షేర్ చేసింది. ఇందులో స్క్రీన్పై పవన్, కీర్తి సురేష్ కనిపిస్తున్నారు. గతంలో పరభాషా భామలు రకుల్ప్రీత్ సింగ్, తాప్సి, నిత్యామీనన్, తమన్నా తదితరులు తమ పాత్రలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు.
పవన్ కల్యాణ్ గురించి
తాజాగా, ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి...పవన్ కల్యాణ్ గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ చిత్రంలో పవన్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని, ఈ సినిమాలో నటించడాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నానని కీర్తి తెలిపింది.
చూడ్డానికి నిశ్శబ్దంగా ఉంటారు
పవన్ కల్యాణ్ చూడ్డానికి నిశ్శబ్దంగా ఉంటారని, కానీ తెరవెనుక చాలా జోక్స్ వేస్తుంటారని చెప్పింది. త్రివిక్రమ్, అను, యూనిట్ మొత్తం ఆయన దగ్గర కూర్చొని సరదాగా నవ్వుకుంటుంటామని, తామంతా ఓ పెద్ద కుటుంబంలా ఉంటామని తెలిపింది. త్రివిక్రమ్ డైలాగ్స్ లో చమత్కారం ఉంటుందని, తన పాత్రకు అలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయని చెప్పింది.
మహానటి
తాము షూటింగ్లో ఉన్నప్పుడు ఆ డైలాగ్స్ కు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందోనని ఊహించుకుంటుంటామని, త్రివిక్రమ్ చాలా ఉత్సాహంగా, సూపర్ పాజిటివ్ గా ఉంటారని కితాబిచ్చింది. ప్రస్తుతం కీర్తి `మహానటి'తో పాటు, విక్రమ్తో ‘సామి 2', సూర్యతో ‘తానా సేంద కూట్టం' లో నటిస్తోంది.