Don't Miss!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలీవుడ్లోకి కీర్తీ సురేష్.. స్టార్ హీరోకు భార్యగా..!
మహానటి, సర్కార్ చిత్రాలతో వరుస విజయాలను చేజిక్కించుకొన్న అందాల నటి కీర్తీ సురేష్ బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. భారత ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్లో కీర్తీ సురేష్ నటించనున్నది. ఈ చిత్రంలో టైటిల్ పాత్రను పోషిస్తున్న అజయ్ దేవగన్ భార్యగా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి బాదాయి హో దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
బాలీవుడ్ ఎంట్రీ గురించి కీర్తీ సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. నా ఛాలెంజింగ్ పాత్రల్లో నటించడం అంటే నాకు చాలా ఇష్టం. భారతీయ చరిత్రలో సయ్యద్ అబ్దుల్ రహీం కథ మరుగున పడిన చాప్టర్. నన్ను ఈ సినిమాలో నటించమని అడిగిన చిత్ర నిర్మాతలకు రుణపడి ఉంటాను అని అన్నారు.
భారతీయ ఫుట్బాల్ క్రీడకు స్వర్ణయుగంగా మారిన సమయంలో జాతీయ ఫుట్ బాల్ జట్టుకు సయ్యద్ అబ్దుల్ రహీం కోచ్గా, మేనేజర్గా ఉన్నారు. ఆయన సారథ్యంలో భారత జట్టు అంతర్జాతీయ పోటీలలో సత్తా చాటింది. ఆయన జీవితంలో చోటుచేసుకొన్న ఒడిదుడుకులు, విజయాల కథా నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది.