Don't Miss!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- News పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము- అభిమానులకు జనసేన కీలక సూచన..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘గీత గోవిందం’ కేరళ వసూళ్లు మొత్తం వరద బాధితులకే!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన 'గీత గోవిందం' చిత్రం సూపర్ హిట్ టాక్తో దూసుకెళుతోంది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 16 కోట్ల గ్రాస్... దాదాపు రూ. పది కోట్ల షేర్ వసూలైంది. అమెరికాలో హాలిడే లేక పోయినా బుధవారం విడుదలైన అక్కడ తొలి రోజు రూ. 3 కోట్లకుపైగా రాబట్టి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్య పరిచింది.
సినిమా సూపర్ హిట్ అవ్వడం, భారీ వసూళ్లు వస్తుండటంతో నిర్మాతలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్నాటక, తమిళనాడు, కేరళలో కూడా విడుదల చేశారు. కేరళలో భారీ వరదల కారణంగా ప్రజలు నిరాశ్రయులు అయిన నేపథ్యంలో కేరళలో వసూలైన షేర్ మొత్తాన్ని... వరద బాధితుల కోసం డొనేట్ చేయబోతున్నట్లు నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు.
బన్నీ వాసు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఒక మంచి సినిమా తీయడమే కాదు, ఈ సినిమా ద్వారా వచ్చే వసూళ్లను సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలనే నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అంటున్నారు.
Producer Bunny Vas announces on behalf of @GeethaArts the total share of #GeethaGovindam collects in Kerala will be donated to #KeralaFloodRelief#KeralaFloods 👌👍 pic.twitter.com/lnPPoZ3FEQ
— SKN - Geetha Govindam Blockbuster (@SKNonline) August 16, 2018
కాగా... 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ టాక్ చూస్తుంటే ఈ చిత్రం ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి రోజే దాదాపు పది కోట్ల షేర్ వచ్చిన నేపథ్యంలో లైఫ్ టైమ్ రన్లో రూ. 50 కోట్ల షేర్ రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.