Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
గ్రామస్తులతో స్టార్ హీరో తల్లి గొడవ.. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన KGF హీరో.. ఏం జరిగిందంటే?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఫ్యామిలీ చెందిన వారు చిన్న వివాదంలో ఉన్నా కూడా ఆ న్యూస్ వైరల్ కాకుండా ఉండదు. ఇక గోడవ గురించి పూర్తిగా తెలియకముందే అనేక రకాల రూమర్స్ రావడం సహజమే. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరో ఫ్యామిలీకి చెందిన ఒక వివాదం వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు. KGF స్టార్ యష్.
ఓ వైవు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్.. ఉప్పెన బ్యూటీ డిఫరెంట్ లుక్స్
రాజకీయాల్లో తిరిగినా కూడా
KGF చాప్టార్ 1 సినిమాతో దేశవ్యాప్తంగా మాస్ హీరోగా మంచి క్రేజ్ అందుకున్న హీరో యష్ చాలా వరకు వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. రాజకీయాల్లో తిరిగినా కూడా కాంట్రవర్సీల జోలికో వెళ్లారనేది నిత్యం వినిపించే టాక్. అయితే మొదటిసారి యష్ ఎవరు ఊహించని ఒక కాంట్రవర్సీలో హాట్ టాపిక్ గా మారారు.
యష్ రాక తప్పలేదు
ప్రస్తుతం కర్ణాటకలో యష్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వివాదం హాట్ టాపిక్ గా మారింది. యష్ కుటుంబ సభ్యుల కారణంగా ఒక గ్రామ ప్రజలు మొత్తం తిరగడ్డారు. హీరో కూడా వివాదంలోకి రాక తప్పలేదు. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు.
అసలు ఎం జరిగిందంటే..
మొదటి నుంచి కర్ణాటక హసన్ జిల్లాలోని తిమ్మాపుర అనే గ్రామంలో ఉంటున్న యష్ తల్లి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి భూమి కొనుగోలు చేశారు. ముందే కొంత భూమిని కొన్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా గ్రామంలోని వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే మొత్తం 80ఎకరాల వరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
పొలంలోకి వెళ్లేందుకు దారి లేకుండా
అయితే భూమి కొన్న తరువాత అక్కడ గ్రామస్తుల పొలంలోకి వెళ్లేందుకు దారి లేకుండా చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఆ పొలాలకు దారి ఉండగా ఇప్పుడు కంచెలు వేసి ధారి లేకుండా చేయడం కరెక్ట్ కాదని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
యష్ మాట్లాడినప్పటికి..
గోడవ మరింత పెద్దది కాకముందే మ్యాటర్ క్లోజ్ చేయాలని యష్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు. గ్రామస్తులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే మాట్లాడిన అనంతరం కూడా పరిష్కారం దొరకలేదని టాక్. యష్ అయితే తన సైడ్ నుంచి ఫుల్ క్లారిటీ ఇచ్చాడని కథనాలు వస్తున్నాయి. ఇక విషయం కోర్టు వరకు కూడా వెళ్లవచ్చని సమాచారం.