Don't Miss!
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
శ్రీదేవి తరుపున నేషనల్ అవార్డు అందుకోనున్న కూతురు ఖుషీ కపూర్
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 65వ జాతీయ సినీ అవార్డుల్లో ప్రముఖనటి, దివంగత శ్రీదేవికి ఉత్తమ నటి అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. 'మామ్' చిత్రంలో నటనకు గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
కాగా, జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేడు (మే 3) ఢిల్లీలో జరుగనుంది. శ్రీదేవి తరుపున ఆమె చిన్న కూతురు ఖుషీ కపూర్ ఈ అవార్డు అందుకోబోతున్నారు. ఈ వేడుకకు శ్రీదేవి భర్త, 'మామ్' నిర్మాత బోనీ కపూర్ తన ఇద్దరు కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్లతో కలిసి హాజరు కాబోతున్నారు.
శ్రీదేవి తన కెరీర్లో పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అయితే జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది మాత్రం 'మామ్' చిత్రానికే. దీన్ని అందుకోవడానికి తమ అభిమాన నటి లేక పోవడం విచారకరమని పలువురు ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
తన బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడి హోటల్ గదిలోని బాత్ టబ్లో ప్రమాదవ శాత్తు పడిపోయి మరణించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న దుబాయ్లో ఆమె మరణించగా, ఫిబ్రవరి 28న ఇండియాలో అంత్యక్రియలు నిర్వహించారు. అతిలోక సుందరి అంతిమ యాత్రలో లక్షలాది మంది అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు.