Don't Miss!
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హస్త ప్రయోగం సీన్, ఆరోజు రాత్రి నర్వస్ అయి... చివరకు గూగుల్ హెల్ప్ తీసుకున్న హీరోయిన్!
భరత్ అనే నేను, ఎంఎస్ ధోని లాంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన కియారా అద్వానీ 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్లో ఘాటైన రొమాంటిక్ సీన్లలో నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. రొమాంటిక్ సీన్లు కాస్త హద్దులు దాటినా అది సర్వసాధారణమే అని అంతా లైట్ తీసుకున్నారు. అయితే ఇందులోని హస్తప్రయోగం సీన్ మాత్రం సెన్సేషన్ అయింది.
భర్త వల్ల సరైన లైంగిక సుఖం పొందలేక అసంతృప్తితో ఉన్న ఒక మహిళ... స్వయంతృప్తి పొందేందుకు వైబ్రేటర్ ఉపయోగించే సీన్ అది. అయితే రేపు ఈ సీన్ చేయడానికి సిద్ధంగా ఉండాలని దర్శకుడు కరణ్ జోహార్ చెప్పగానే ఆ రోజు రాత్రి కియారా చాలా నర్వస్ అయిందట. నేహా ధూపియా చాట్ షోలో పాల్గొన్న కియారా ఈ విషయం వెల్లడించింది.
ఆ సీన్ మాత్రం చేసి చూపించలేక పోయారు
కరణ్ జోహార్ ఏ సీన్ అయినా ఎలా చేయాలో చేసి చూపిస్తారు. అయితే ఆ వైబ్రేటర్ సీన్ విషయంలో మాత్రం అలా చేసి చూపించలేక పోయారు. నవ్వకుండా పర్ఫెక్టుగా చేయాలని, ముందుగా ప్రిపేర్ అవ్వాలని చెప్పారని... కియారా అద్వానీ నేహా చాట్ షోలో గుర్తు చేసుకున్నారు.
గూగుల్ తల్లి సహాయం తీసుకున్నా
స్వయంతృప్తి పొందడానికి ఆ వైబ్రేటర్లను ఎలా వాడతారో తెలుసుకోవడానికి గూగుల్ హెల్ప్ తీసుకున్నాను. ‘అగ్లీ ట్రూత్' అనే చిత్రంలో ఆ సీన్లు ఎలా చేశారో గమనించాను. ఆ తర్వాత ఎలా చేయాలనే విషయమై ఒక అవగాహన వచ్చింది. ఆ సీన్ చేయడానికి కాన్ఫిడెన్స్ కూడబెట్టుకుని వెళ్లినట్లు ఆ రోజు షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన కియారా గుర్తు చేసుకున్నారు.
ప్రేక్షకులు ఫీలయ్యేలా, రియాల్టీకి దగ్గరగా....
ప్రేక్షకులు ఒక సీన్ చూస్తున్నపుడు నిజంగా అది జరిగినట్లు వారు ఫీలైనపుడే నటులుగా మనం సక్సెస్ అయినట్లు. ఈ విషయంలో కరణ్ జోహార్ చెప్పిన సూచనలు ఫాలో అయ్యాను. అయితే ఆ సీన్కు అంతబాగా రెస్పాన్స్ వస్తుందని కూడా ఊహించలేదని కియారా తెలిపారు.
కియారా అద్వానీ
కియారా అద్వానీ సినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన ‘కబీర్ సింగ్' జూన్ 21న విడుదలకాబోతోంది. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి' చిత్రానికి ఇది రీమేక్. విజయ్ దేవరకొండ పోషించిన అర్జున్ రెడ్డి పాత్రలో... షాహిద్ కపూర్, షాలిని పాండే పోషించి ప్రీతి పాత్రలో కియారా కనిపించబోతోంది.