Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాంచరణ్ కోసం బాలీవుడ్ బ్యూటీ రెడీ.. శంకర్ మూవీ కోసం రంగంలోకి టాలెంటెడ్ రైటర్
మెగా పవర్ స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మిస్తున్న మూవీ ఇంకా సెట్స్పైకి వెళ్లకుండానే సంచలనాలకు వేదికగా మారుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల ఎంపిక, హీరోయిన్, ఇతర నటీనటులు ఎంపిక ప్రస్తుతం హాట్ హాట్ వార్తగా మారుతున్నది. ఈ సినిమా కోసం రంగంలోకి దిగిన ప్రముఖులు ఎవరంటే...
మరో చందమామ లాంటి గ్లామర్.. మధుమితా హాట్ లుక్స్
అవినీతిపై ఉక్కుపాదం మోపే..
అవినీతిపై అస్త్రాన్ని సంధించే కథతో వస్తున్న శంకర్ మరోసారి భారతీయుడు, శివాజీ లాంటి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం భారీగా వీఎఫ్ఎక్స్, ఇతర సాంకేతికతను వాడేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం దిల్ రాజు కూడా భారీగా ఖర్చు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
పవర్ఫుల్ ఆఫీసర్గా రాంచరణ్
అయితే ఈ చిత్రంలో రాంచరణ్ పోలీస్ ఆఫీసర్గా లేదా కలెక్టర్గా నటించే అవకాశం ఉందనేది తాజా సమాచారం. ఈ పాత్ర కోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఈ పాత్ర స్వరూపాన్ని అర్ధం చేసుకోవడానికి పలువురితో చర్చలు జరుపుతున్నారు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అదిరిపోయే డైలాగ్స్ కోసం వివేక్
పవర్ఫుల్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్న రాంచరణ్కు మాస్, మసాలా డైలాగ్స్ రాయడానికి టాలెంటెడ్ రైటర్ వివేక్ను రంగంలోకి దించారు. కథ, కథనాలు బలంగా ఉండేందుకు ఆయనతో డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాయిస్తున్నారు. వివేక్ విషయానికి వస్తే.. మెర్సల్, బిగిల్, దర్బార్, ఇరంబు థిరై, సోరారై పొట్రూ, జగమే థాందిరాం అనే చిత్రాలకు పనిచేశారు. ప్రస్తుతం శంకర్తో కలిసి ఈ సినిమాపై కసరత్తు చేస్తున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొన్నాయి.
రాంచరణ్ సరసన కియారా అద్వాని
ఇక రాంచరణ్ సరసన నటించే భామను కూడా ఖారారు చేసినట్టు తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీని ఎంపిక చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను జూలై, ఆగస్టు నెలలో సెట్స్పైకి తీసుకెళ్లే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన సమాచారం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
Recommended Video
సంక్రాంతికి RRRతో చెర్రీ
ఇదిలా ఉండగా, రాంచరణ్ నటిస్తున్న RRR చిత్రం షూటింగు దశలో ఉంది. అలాగే నిర్మాతగా రాంచరణ్ నిర్మిస్తున్న ఆచార్య చిత్రం ముగింపు దశలో ఉంది. ఈ రెండు సినిమా షూటింగు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అంతా సవ్యంగా సాగితే RRR చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నది.