Don't Miss!
- News అమిత్ షా ఓ గూండా, రౌడీ, అయినా పక్కనే పెట్టుకున్న ప్రధాని మోదీ, సీఎం కొడుకు సంచలనం!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బ్రేకప్ అంటూ వార్తలు.. ఇన్ డైరెక్ట్ గా ప్రశ్నించిన రిపోర్టర్.. ఓపెన్ అయిన కియారా!
సినీ పరిశ్రమలో ప్రేమలు- బ్రేకప్లు, ప్రేమ పెళ్లిళ్లు- విడాకులు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. సాధారణ ప్రజలే ఈ మధ్య ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు ఇక డబ్బు, హోదా అన్నీ ఉన్న సినీ సెలబ్రిటీలు మాత్రం ఎందుకు వెనుకడుగు వేస్తారు? వారు కూడా నచ్చినంత కాలం కలిసి ఉండడం ఇక తమకు పొసగదు అనుకున్న వెంటనే బ్రేకప్ చెప్పుకోవడం లేదా విడాకులు తీసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ప్రేమలో పడిన కియారా అద్వానీ బ్రేక్ అప్ చెప్పింది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె మొట్టమొదటిసారిగా ఆ విషయం మీద పరోక్షంగా నోరు విప్పింది.. ఆ వివరాల్లోకి వెళితే
ఫగ్లీ అనే సినిమాలో
నటిగా మెరిసి పోవాలని భావించి తొలుత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది కియారా అద్వానీ. ఆమె అసలు పేరు అలియా అద్వానీ కాగా అప్పటికె అలియా భట్ కూడా సినీ రంగ ప్రవేశం చేయడంతో ఇద్దరు అలియాలు ఉంటే సినిమా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పడంతో ఆమె కియారా అద్వానీగా తన పేరు మార్చుకుంది. తొలుత మోడలింగ్ చేసిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ లో ఫగ్లీ అనే సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.
మంచి హిట్
అది చిన్న సినిమా అయినా ఆ సినిమాలో ఆమె నటనకు గాను మంచి అప్లాజ్ లభించింది. ఇక ఆ తర్వాత ఆమె ఎంఎస్ ధోని బయో పిక్ ద్వారా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఉన్న సమయంలో ఆమె టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన పొలిటికల్ డ్రామా భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించి మంచి హిట్ కొట్టింది.
మీడియా దృష్టిలో
ఆ
తర్వాత
ఈ
భామ
రామ్
చరణ్
తేజ్
సరసన
వినయ
విధేయ
రామ
అనే
మరో
సినిమా
చేయగా
సినిమా
మాత్రం
డిజాస్టర్
ఫలితం
అందుకుంది.
ఆ
తర్వాత
ఆమె
బాలీవుడ్
లో
సిద్ధార్థ్
మల్హోత్రాతో
కలిసి
నటించిన
షేర్షా
సినిమా
అమెజాన్
లో
విడుదలై
ఓ
అద్భుతమైన
విజయాన్ని
సాధించింది.
వీరు
డేటింగ్
చేస్తున్న
సమయంలో
షేర్షాలో
కలిసి
నటించారు.
సినిమాలో
వారి
ఇద్దరి
మధ్య
కెమిస్ట్రీ
ఎమోషనల్
సీన్స్
కూడా
ప్రేక్షకులకు
బాగా
నచ్చాయి.
వీరిద్దరూ
కలిసి
ప్రమోషన్
టైంలో
చేసిన
హంగామా
కూడా
అప్పట్లో
మీడియా
దృష్టిలో
పడింది.
బ్రేకప్ చెప్పుకున్నారని
ఆ తర్వాత వీరిద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్లడం అక్కడ ఫోటోలను షేర్ చేయడం కూడా వీరి మధ్య ఏదో జరుగుతోందని అనిపించేలా చేసింది. ఇక అదే సినిమా ప్రమోషన్ సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రా తమ డేటింగ్ విషయం మీద నోరు విప్పాడు. సినిమా కంటే తమ బంధం అతీతమైనది అని చెప్పుకొచ్చాడు. కొద్ది రోజుల నుంచి వీరి మధ్య దూరం పెరిగిందని వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని కూడా ప్రచారం జరుగుతుండగా మొట్టమొదటిసారి ఈ విషయం మీద ఆమె స్పందించింది.
తెలివిగా సమాధానం
ఆమె భూల్ భులయ్యా 2 అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం బయటకు రాగా అదే సమయంలో జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగారు మీరు మీ జీవితంలోకి వచ్చిన ఎవరినైనా మర్చిపోవాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించగా లేదు నా జీవితంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ నా జీవితంలో ఏదో ఒకటి యాడ్ చేశారు అందుకే వాళ్లని ఎవ్వరినీ మర్చిపోను, అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో ఎక్కడ కూడా సిద్ధార్థ మల్హోత్రా పేరు ప్రస్తావించలేదు కానీ సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ సిద్ధార్థ మల్హోత్రాని ఉద్దేశించి ఈ ప్రశ్న అడిగాడు అది తెలిసి కూడా ఆమె తెలివిగా సమాధానం చెప్పింది అని కామెంట్ చేస్తున్నారు.