Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టాలీవుడ్ దర్శకుడు 32 సార్లు ఏడ్పించాడు.. కైరా అద్వానీ
టాలీవుడ్లో యువ హీరోయిన్లకు కొదవేం లేదు. అలా దూసుకొచ్చిన నూతన తారల్లో ప్రతిభావంతురాలు కైరా అద్వానీ. భరత్ అనే నేను చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకొన్నది. మహేష్బాబుకు సరైన జోడి అనే బ్రాండ్ పేరును సంపాదించుకొన్నది. భరత్ అనే నేను హిట్తో రాంచరణ్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకొన్నది.
రాంచరణ్ సినిమా గురించి
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య మెగా హీరో రాంచరణ్తో రూపొందించే చిత్ర షూటింగ్లో కైరా అద్వానీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో భారమైన పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ను కైరా వెల్లడించింది.
32 సార్లు ఏడ్పించాడు
నాపై దర్శకుడు బోయపాటి శ్రీను ఓ భావోద్వేగమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాడు. ఆ సన్నివేశం కోసం 32 సార్లు ఏడ్పించాడు. ఆయన 32 టేక్స్ నా నుంచి తీసుకొన్నారు. సినిమాలో ఆ సన్నివేశం చాలా కీలకమైంది అని కైరా అద్వాని తెలిపింది.
లస్ట్ స్టోరీస్తో
భరత్ అనే నేను తర్వాత కైరా నెట్ఫ్లిక్స్లో ప్రసారమయ్యే లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్లో నటించింది. లస్ట్ స్టోరిస్లోని ఆమె నటనకు క్రిటిక్స్ ప్రశంసలతో ముంచెత్తారు. లస్ట్ స్టోరిస్ తర్వాత నా జీవితమే మారిపోయిందనే మాటను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఇటీవలే 26వ జన్మదినం
ఇటీవలే తన 26వ జన్మదినం జరుపుకొన్న కైరా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్లో కాలాంక్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఆ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. రాంచరణ్తో సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకొన్నది ఈ అందాల భామ.