Don't Miss!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
టాలీవుడ్ దర్శకుడు 32 సార్లు ఏడ్పించాడు.. కైరా అద్వానీ
టాలీవుడ్లో యువ హీరోయిన్లకు కొదవేం లేదు. అలా దూసుకొచ్చిన నూతన తారల్లో ప్రతిభావంతురాలు కైరా అద్వానీ. భరత్ అనే నేను చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకొన్నది. మహేష్బాబుకు సరైన జోడి అనే బ్రాండ్ పేరును సంపాదించుకొన్నది. భరత్ అనే నేను హిట్తో రాంచరణ్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకొన్నది.
రాంచరణ్ సినిమా గురించి
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య మెగా హీరో రాంచరణ్తో రూపొందించే చిత్ర షూటింగ్లో కైరా అద్వానీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో భారమైన పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ను కైరా వెల్లడించింది.
32 సార్లు ఏడ్పించాడు
నాపై దర్శకుడు బోయపాటి శ్రీను ఓ భావోద్వేగమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాడు. ఆ సన్నివేశం కోసం 32 సార్లు ఏడ్పించాడు. ఆయన 32 టేక్స్ నా నుంచి తీసుకొన్నారు. సినిమాలో ఆ సన్నివేశం చాలా కీలకమైంది అని కైరా అద్వాని తెలిపింది.
లస్ట్ స్టోరీస్తో
భరత్ అనే నేను తర్వాత కైరా నెట్ఫ్లిక్స్లో ప్రసారమయ్యే లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్లో నటించింది. లస్ట్ స్టోరిస్లోని ఆమె నటనకు క్రిటిక్స్ ప్రశంసలతో ముంచెత్తారు. లస్ట్ స్టోరిస్ తర్వాత నా జీవితమే మారిపోయిందనే మాటను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఇటీవలే 26వ జన్మదినం
ఇటీవలే తన 26వ జన్మదినం జరుపుకొన్న కైరా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్లో కాలాంక్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఆ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. రాంచరణ్తో సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకొన్నది ఈ అందాల భామ.