Don't Miss!
- News భోజనాలున్నాయమ్మా వెళ్లొద్దు.. విజయసాయికి షాక్; ఇజ్జత్ తీసిన టీడీపీ!!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చేపలు పట్టే వాడే ‘కిక్ శ్యామ్’
'కిక్" సినిమాలో రెండో హీరోగా చేసిన శ్యామ్ హీరోగా 'మల్లికాకపూర్" హీరోయిన్గా 'వీడు మనవాడే" చిత్రం రూపొందుతోంది. అన్నం ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నేతాజీ దర్శకత్వంలో సి.విజయకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నార. ఈ చిత్రం షూటింగ్ సారథి స్టూడియోలో జరుగుతోంది.
తాజా షెడ్యూల్ను ఈ నెలాఖరు వరకు జరుపుతామని దర్శకుడు నేతాజీ చెప్పారు. ఈ చిత్రం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా..తమిళంలో మరొక చిత్రం అంగీకరించడంతో ఆ చిత్రానికి పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కులుమనాలి, చెన్నై, మహాబళేశ్వరం తదితర ప్రాంతాల్లో చిత్రీకరించామని చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం తమిళంలో ఇటీవలే విడుదలైందని, తెలుగు వర్షన్ నేటివిటీకి తగినట్లు మళ్లీ షూటింగ్ చేస్తున్నామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ముందుగా 'సిలువ నీడలో" అనే పేరు పెట్టామనీ, ఆ తర్వాత కథాపరంగా ఆలోచించి 'వీడు మనవాడే" గా పేరును ఖరారు చేశామన్నారు.
హీరో శ్యామ్ మాట్లాడుతూ తాను ఇందులో చేపలు పట్టే వ్యక్తిగా నటిస్తున్నానని చెప్పారు. జాలరులు నివసించే ప్రాంతాన్ని సారథిలో సెట్ గా వేశారు. అక్కడ గత కొద్దిరోజులుగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. క్రింది స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తిగా తన పాత్ర ఉంటుందని ఈ చిత్రం ద్వారా తనకు 'కిక్" సినిమా తర్వాత తనకు మంచి గుర్తింపు వస్తుందని శ్యామ్ ఆశించారు. ఇందులో విజయభాస్కర్ బ్లైండ్ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇంకా రామిరెడ్డి, సైరాభాను, వేణుమాధవ్, రంగనాథ్ తదితరులు నటిస్తున్నారు.