Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లక్కు కోసం... కిక్కు శ్యామ్తో రవితేజ!
హైదరాబాద్: మాస్ మహారాజా రవి తేజ హీరో గా, మళయాళ చిత్రం ప్రేమం తో యువకుల మనసులు దోచుకున్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా త్వరలో 'ఎవడో ఒకడు' అనే చిత్రం రాబోతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారి నిర్మాణ సారధ్యం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రం రాబోతోంది. 'ఓహ్ మై ఫ్రెండ్' చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.
రవితేజ కెరీర్కు ‘కిక్' సినిమా ఎంతటి విజయాన్ని అందించిందో తెలిసిందే. ఈ సినిమా విజయంలో శ్యామ్ కూడా కీ-రోల్ ప్లే చేశాడు. అందుకే ఈ సినిమాతో కిక్నే తన ఇంటిపేరుగా మార్చుకుని కిక్ శ్యామ్ అయ్యాడు. ఆ తర్వాత కిక్ సెంటిమెంట్ను రిపీట్ చేస్తూ శ్యామ్ను తన రేసుగుర్రంలో సినిమాలోకి తీసుకుని.. మరో హిట్ కొట్టాడు సురేందర్ రెడ్డి. దీంతో ఇప్పుడు రవితేజ కూడా శ్యామ్ వైపుకు చూస్తున్నాడట. ‘ఎవడో ఒకడు' చిత్రంలో కీలక పాత్ర కోసం శ్యామ్ను ఎంపిక చేశారట. కిక్ సినిమా తరహాలోనే రవితేజతో పోటాపోటీగా ఢీ కొట్టే పాత్రను ఈ చిత్రంలో శ్యామ్ పోషించనున్నాడట.
ఈ చిత్రానికి సంగీతానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తారు. ఈ చిత్రం లో రవి తేజ గారిని ఒక కొత్త కోణం లో చూపిస్తాం అని దర్శకులు వేణు శ్రీ రామ్ తెలిపారు. 'ఎవడో ఒకడు' చిత్రం లో యువత ను ఆకట్టుకునే అంశాలు చాలా ఉంటాయని, యువత ఆశయాలకు అద్దం పట్టే కథ అవుతుందని ఆయన అన్నారు.
"రవి తేజ గారి తో భద్ర సినిమా తో సూపర్ హిట్ తీసాం. మళ్లీ ఇన్నాళ్ళకు ఆయనతో పని చేయటం, మా బ్యానర్ తో ఎంతో కాలం గా పరిచయం ఉన్న వేణు శ్రీ రామ్ తో, దేవి శ్రీ ప్రసాద్ తో పని చేయటం ఆనందం గా ఉంది" అని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆర్య, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, ఎవడు వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన తమ బ్యానర్ లో ఇది మరొక మంచి చిత్రం అవుతుంది అన్న నమ్మకాన్ని అయన వ్యక్త పరిచారు.
రవి తేజ, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, నాసర్, రావు రమేష్ ఈ చిత్రం లో ముఖ్య నటులు. కథ - స్క్రీన్ప్లే - దర్శకత్వం : వేణు శ్రీ రామ్ . కెమెరా : రిచర్డ్ ప్రసాద్ . సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ . డైలాగ్స్ : రమేష్ , గోపి . ఎడిటర్ - శ్రీను . కో ప్రొడ్యూసర్స్ - శిరీష్, లక్ష్మణ్ . నిర్మాత : దిల్ రాజు.