Don't Miss!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బూతు తీయలేదు..లవ్ ఫిలిమ్ మాత్రమే
తమ చిత్రం ఎంతమాత్రం బూతు సినిమా కాదనీ, రొమాంటిక్ లవ్ సెన్సిబుల్ చిత్రమని దర్శకుడు నరసింహ నంది తెలిపారు. తాజాగా నంది అవార్డు అందుకున్న ఆయన 'హైస్కూలు'అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కిరణ్ రాథోడ్, మాస్టర్ కార్తీక్ ప్రధాన పాత్రధారులుగా ఐశ్వర్య ఫిలింస్ పతాకంపై మల్లన్న నిర్మిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు.
బి.గోపాల్ మాట్లాడుతూ...సాకేత్ సాయిరామ్ అందించిన పాటలన్నీ చాలా బాగున్నాయనీ, మాస్టర్ కార్తీక్ కు మంచి భవిష్యత్తు ఉందనీ అన్నారు. ఈ సినిమా క్లిప్పింగ్ చాలా బాగున్నాయనీ, చిత్ర దర్శకుడు నరసింహ నంది గతంలో '1940లో ఒక గ్రామం' అనే చక్కటి చిత్రాన్ని తీశారనీ తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.
నిర్మాత మల్లన్న మాట్లాడుతూ...ఇవాల్టి ట్రెండ్ కు అనుగుణంగా ఓ మంచి పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కిందని పేర్కొన్నారు. పాటలకు, రీరికార్డింగ్ కూ మంచి స్కోప్ ఉందనీ, దర్శకుడికి కూడా ఈ చిత్రం మంచి పేరు తెస్తుందనీ సాకేత్ సాయిరామ్ అన్నారు. సాకేత్ సాయిరామ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో సుప్రీం మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది.