సెన్సార్బోర్డు ఛైర్పర్సన్ మారారు
న్యూఢిల్లీ : కేంద్ర చలనచిత్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) ఛైర్పర్సన్ రేసులో ప్రముఖ బాలీవుడ్ నటి, భాజపా చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్ ముందు వరుసలో ఉన్నారు. 23 మంది కొత్త సభ్యులతో కిరణ్ఖేర్ ఛైర్పర్సన్గా సెన్సార్ బోర్డు కొలువుతీరుతుందని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.
తాత్కాలికంగా రాకేష్ కుమార్ నేతృత్వంలో సెన్సార్ బోర్డు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఆగస్టు 18న ఆయన్ను సీబీఐ అరెస్టు చేయడంతో ఆ బోర్డు రద్దయింది. కిరణ్ ఖేర్ భర్త, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ను వాజ్పేయి ప్రభుత్వం 2003లో సీబీఎఫ్సీ ఛైర్పర్సన్గా నియమించింది.



Click it and Unblock the Notifications











