Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఊటీలాగ అభివృద్ధి చేస్తాం: తెలుగు సినీ పరిశ్రమకు కేంద్ర మంత్రి హామీ
తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ స్థాపించి.. ఇప్పటికి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్లో సినీ దిగ్గజాలంతా ఒకే వేదికపైకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో సహా పలువరు నేతలు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అలాగే.. పలువురు సినీ ప్రముఖులకు అవార్డులను బహుమతి చేశారు. దీనికి టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేశ్ బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ కార్యక్రమం ఆసాంతం ఉల్లాసంగా సాగింది. తారల తళుక్కులు, టెక్నీషియన్ల ప్రదర్శనలు, ఫ్యాన్స్ కేరింతలతో ఈ వేడుకను ఆంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమకు హామీ ఇచ్చారు. 'సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుంది. ఊటీలాగే కాశ్మీర్ను కూడా షూటింగ్ చేసుకోడానికి అనుకూలంగా అభివృద్ధి చేస్తాం. అక్కడ ఫిల్మ్ స్టూడియోలు నిర్మించుకోడానికి అవకాశాలు కల్పిస్తాం' అని ఆయన చెప్పారు.
ఇక, ఇదే వేడుకలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగాస్టార్ చిరంజీవి మధ్య చర్చలు జరిగాయి. అలాగే, ఒక హీరోయిన్ అలిగి వెళ్లిపోయిందన్న కామెంట్లు కూడా వినిపించాయి. మొత్తంగా ఈ వేడుకకు కృష్ణ, కోటా శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, రాజేశేఖర్, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్, సురేష్ బాబు, నిహారిక, నాగబాబు, రామ్ లక్ష్మణ్, సందీప్ కిషన్, రాశి ఖన్నా, రెజీనా, ప్రగ్యా జస్వాల్, పూజా హెగ్డే, గిరిబాబు, శ్రీకాంత్, అశ్వినిదత్, బోయపాటి శ్రీను, సాయి ధరమ్ తేజ్ తదితరులు విచ్చేశారు.