జేసుదాస్కు 'హరివరాసనం'అవార్డ్

ఏప్రిల్ నెలలో వచ్చే కేరళ నూతన సంవత్సరాది రోజైన 'విషు' పర్వదినాన ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది. స్వామి అయ్యప్ప పరమభక్తుడైన ఏసుదాసు శబరిగిరీశునిపై ఎన్నో భక్తిగీతాలను ఆలపించారు. ఈ గీతాలలో అత్యంత ప్రజాదరణ పొందిన 'హరివరాసనం' పేరిటే ఈ పురస్కారాన్ని నెలకొల్పారు. ఈ గీతం ప్రతిరోజూ శబరిమలపై మారుమోగుతూ భక్తులను పరవశింపజేస్తుంది. కర్ణాటకలోని మూకాంబిక అమ్మవారి ఆలయంలో గతవారం తన 72వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్న ఏసుదాస్ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు.
హిందూ, క్రైస్తవ, ముస్లిం భక్తిగీతాలని భావయుక్తంగా ఆలపించి తన 50 ఏళ్ళ సంగీత జీవితంలో అశేష అభిమానుల హృదయాల్ని గెల్చుకున్నారు. ఇందుకు సంకేతంగా 'ఒకే కులం, ఒకే మతం, ఒకే దైవం' అన్న సందేశాన్నిచ్చే శ్రీ నారాయణగురు గీతాన్నే నవంబర్ 14, 1961వ తేదీన తన తొలి సినిమా పాటగా ఏసుదాస్ ఆలపించారు. ధట్స్ తెలుగు ఈ అధ్బుత గాయకుడుకి శుభాకాంక్షలు తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











