Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జేసుదాస్కు 'హరివరాసనం'అవార్డ్
ఏప్రిల్ నెలలో వచ్చే కేరళ నూతన సంవత్సరాది రోజైన 'విషు' పర్వదినాన ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది. స్వామి అయ్యప్ప పరమభక్తుడైన ఏసుదాసు శబరిగిరీశునిపై ఎన్నో భక్తిగీతాలను ఆలపించారు. ఈ గీతాలలో అత్యంత ప్రజాదరణ పొందిన 'హరివరాసనం' పేరిటే ఈ పురస్కారాన్ని నెలకొల్పారు. ఈ గీతం ప్రతిరోజూ శబరిమలపై మారుమోగుతూ భక్తులను పరవశింపజేస్తుంది. కర్ణాటకలోని మూకాంబిక అమ్మవారి ఆలయంలో గతవారం తన 72వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్న ఏసుదాస్ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు.
హిందూ, క్రైస్తవ, ముస్లిం భక్తిగీతాలని భావయుక్తంగా ఆలపించి తన 50 ఏళ్ళ సంగీత జీవితంలో అశేష అభిమానుల హృదయాల్ని గెల్చుకున్నారు. ఇందుకు సంకేతంగా 'ఒకే కులం, ఒకే మతం, ఒకే దైవం' అన్న సందేశాన్నిచ్చే శ్రీ నారాయణగురు గీతాన్నే నవంబర్ 14, 1961వ తేదీన తన తొలి సినిమా పాటగా ఏసుదాస్ ఆలపించారు. ధట్స్ తెలుగు ఈ అధ్బుత గాయకుడుకి శుభాకాంక్షలు తెలుపుతోంది.