Don't Miss!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'తో పాటే 'కో అంటే కోటి'
హైదరాబాద్ : శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. ఈ రోజు విడుదల అవుతున్న ఈ చిత్రంతో పాటే 'కో అంటే కోటి'చిత్రం ట్రైలర్స్ విడుదల చేస్తున్నారు. శేఖర్ కమ్ముల స్నేహితుడు అనీష్ కురువిల్లా'కో అంటే కోటి'చిత్రం దర్శకుడు కావటంతో ఈ ట్రైలర్స్ ని కలిపి విడుదల చేసారు. శర్వానంద్, ప్రియా ఆనంద్ జంటగా నటిస్తున్న చిత్రం 'కో అంటే కోటి'. శర్వానంద్ నిర్మాతగా కూడా మారి ఈ చిత్రాన్ని సొంతగా నిర్మిస్తుండటం ఓ విశేషం. అనీష్ కురువిల్లా (ఆవకాయ్బిర్యాని ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.
ఇటీవలనే ఈ చిత్రం తొలి షెడ్యూల్ను రాజమండ్రిలో జరిపారు. ఇందులో భాగంగా 50 మంది పిల్లల మధ్యన తనపై సన్నివేశాలను చిత్రీకరించడం మరచిపోలేని అనుభూతి నిచ్చిందని ప్రియా ఆనంద్ అన్నారు. శర్వానంద్ చక్కటి నటుడని, అతను పాత్రను ఆకళింపు చేసుకునే విధానం తనకెంతో బాగా నచ్చిందని ఆమె చెప్పారు. ఓ మంచి నటుడితో కలసి ఈ చిత్రం చేస్తుండటం తెలుగులో తన కెరీర్ మలుపుకు ఎంతగానో దోహదం చేస్తుందన్నారామె. నిర్మాతగా మారేందుకు చక్కటి కథే ప్రేరణను ఇచ్చిందని శర్వానంద్ తెలిపారు. తనదైన నేర్పుతో దర్శకుడు అనీష్ దీనిని ఎంతోబాగా తీర్చిదిద్దుతున్నారని ఆయన చెప్పారు.
జర్నితో మరో మారు ప్రూవ్ చేసుకున్న శర్వానంద్ ఈ చిత్రం తనకు కమర్షియల్ గా బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నాడు. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరగే కథ అని,రోడ్ మూవీ గా తెరకెక్కుతోందని చెప్తున్నారు. ఈ చిత్రాన్ని మొదట సిద్దార్ధతో అనుకున్నారు కానీ సిద్దార్ద డేట్స్ క్లాష్ రావటంతో శర్వానంద్ ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. కొంతమంది స్నేహితులతో కలిసి సొంతంగా ఓ బ్యానర్ ప్రారంభించి ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ చిత్రం కథపై ఉన్న నమ్మకంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దర్శకుడు అనీష్ సైతం.. ఆవకాయ బిర్యాని తర్వాత డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇదే కావటం గమనార్హం. శేఖర్ కమ్ముల సహకారం కూడా ఉండనుందని తెలుస్తోంది.
ఇక శర్వానంద్ లేటెస్ట్ గా అల్లరి నరేష్ తో కలిసి చేసిన నువ్వా... నేనా చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత శర్వానంద్ చేస్తున్న చిత్రం ఇదే. అలాగే ఈ చిత్రం అనంతరం చేరన్ దర్శకత్వంలో ఓ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. కథ నచ్చాకే చిత్రం చేస్తానని,అందుకే ప్రాజెక్టులు లేటవుతున్నాయని శర్వానంద్ అంటున్నారు. జర్నీ వంటి చిత్రం తర్వాత చాలా ఆఫర్సే వచ్చినా కొత్త తరహా స్క్రిప్టుకోసం ఆగారని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ్లో 'జెకె ఎనుమ్ నన్బనిన్ వాళ్కై' అనే చిత్రంలో నటిస్తున్నాడు.