Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఫ్లాఫ్ సినిమాని జపాన్ కి...పరువు పోదా
హైదరాబాద్ : ఇండియాలో హిట్టైన సినిమాను ఇతర దేశాలకు పంపితే అక్కడ ఆడి మనకు గౌరవం తెస్తుంది. అయితే ఇక్కడ డిజాస్టర్ సినిమాలను అక్కడకి పంపుతే తేడా రిజల్ట్ వస్తుందా. రజనీకాంత్ కు జపాన్ లో మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఇన్నాళ్లూ హిట్ చిత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు రజనీకాంత్ సూపర్ ఫ్లాఫ్ ..విక్రమ్ సింహా ని సైతం అక్కడ విడుదల చేయటానికి నిర్ణయించారు. జపాన్ భాషలోకి డబ్బింగ్ పూర్తి చేసారు. ఈ వార్త విన్నవాళ్లు రజనీకాంత్ అనవసరంగా ఈ చిత్రాన్ని జపాన్ కి పంపుతున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడ ఆయనకు ఉన్న పరువు తీయటానికి కాకపోతే ఎందుకు ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేయటం అని విమర్శిస్తున్నారు.
కథ విషయానికొస్తే... కలింగపురం, కోట పట్టణం అనే రెండు రాజ్యాల మధ్య తరతరాలుగా శతృత్వం ఉంటుంది. కోట పట్టణం రాజ్యానికి రాజు ఉగ్ర సింహా(నాజర్), కలింగపురానికి రాజు రాజ మహేంద్రుడు(జాకీ ష్రాఫ్). కలింగపురానికి వీరుడు ధీరుడు అయిన రాణా అలియాస్ రణధీర(రజనీకాంత్) సర్వ సైన్యాధిపతి. రాణా నాయకత్వంలో కలింగపురం సేనలు శతృ దేశాలను ఓడిస్తాయి. కోట పట్టణంతో యుద్ధం సమయం వచ్చే సరికి ఉన్నట్టుండి రానా కలింగపురం నుండి కోటపట్టణం వైపుషిప్ట్ అవుతాడు. కోట పట్టణంలో సైన్యాధికారిగా నియమితుడవుతాడు. రాణా ఇక్కడికి వచ్చిందే కోటపట్టణం రాను ఉగ్రసింహను చంపడాని. రాణా ఇలా చేయడానికి కారణం అతని తండ్రి విక్రమ సింహ ఫ్లాష్ బ్యాక్......పూర్తి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాలో రజనీ సరసన దీపికా పదుకొణే నటించింది. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. సునీల్ లుల్ల నిర్మాత. ఎ.ఆర్.రెహమాన్ స్వరపరచిన పాటల్ని రీసెంట్ గా విడుదలయ్యాయి. 'రోబో' తర్వాత రజనీకాంత్ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్స్టార్. సీనియర్ దర్శకుడు కేయస్ రవికుమార్ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్గా రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు.