పంజా విసురుతున్న ‘కొమరం పులి’
ఘన విజయాన్ని సాధించిన జల్సా సినిమా తర్వాత 'కొమరం పులి"గా ఈ సంవత్సరం చివరన మనముందుకు రాబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం బ్యాకాంక్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ సరనసన నిఖిషా పటేల్ ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాకి మరో విశేషం ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించడం.
పవర్స్టార్ పవన్కళ్యాణ్ హీరోగా శ్రీకనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ నిర్మిస్తున్న చిత్రం 'కొమరం పులి'. ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ 'ఖుషి" కాంబినేషన్లో 'కొమరం పులి" అనే భారీ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొట్ట మొదటిసారిగా పోలీసాఫీసర్గా నటిస్తున్నారు. అంతే కాకుండా ద్విపాత్రాభినయం కూడా చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఏ సమాచారం బయటకు పొక్కకుండా దర్శక, నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల చేసి చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలని నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ష్యూటింగ్ తర్వాత చిత్రం గణేష్ బాబు నిర్మాణంలో రూపొందుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











