twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆది పినిశెట్టి, తాప్సీ మూవీ లాంచ్ చేయబోతున్న నాని

    By Bojja Kumar
    |

    కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా బేనర్లో నాని హీరోగా తెరకెక్కిన 'నిన్ను కోరి' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఈ చిత్రం అందించిన విజయంతో మరో సినిమాకు సిద్ధమవుతున్నారు చిత్ర నిర్మాతలు.

    ఆది పనిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా వారు మరో సినిమా నిర్మించబోతున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ మే 24న చేయబోతున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

    Kona Filmcorporation next film with Aadhi Pinisetty

    ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. నాని చేతుల మీదుగా ఉదయం 11:11 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో విడుదల చేయబోతున్నారు.

    'నిన్ను కోరి' మూవీలో ఆది పినిశెట్టి కీలకమైన పాత్రలో నటించారు. ఆ సమయంలోనే ఆది హీరోగా సినిమా చేయాలని నిర్మాతలు కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఫిక్స్ అయ్యారు. ఆ మూవీ తర్వాత ఆది పినిశెట్టి 'అజ్ఞాతవాసి', 'రంగస్థలం' సినిమాలతో బిజీ అయిపోయారు. ఇపుడు అంతా సెట్టవ్వడంతో ఆది హీరోగా మరో సినిమా ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది.

    English summary
    After a heart touching victory of Ninnu Kori, Kona Filmcorporation teams up wid MVV cinema for another blockbuster wid Aadhi Pinisetty, Taapsee & Ritika Singh. The title will be unveiled on May 24 at 11:11am by Natural Star Nani.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X