Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'బాద్షా' ఆడియా వాయిదా రీజన్ చెప్పిన కోన వెంకట్
హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల రూపొందిస్తున్న 'బాద్షా' ఆడియో వేడుక భద్రతా కారణాల రీత్యా మార్చి 10 నుంచి వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆడియో వేడుక వాయిదా పడిన సంగతిని ఆ చిత్ర రచయిత కోన వెంకట్ ట్విట్టర్ ద్వారా ఖరారు చేసారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
కోన వెంకట్ ట్వీట్ లో... "భద్రతా కారణాలు, మహాశివరాత్రి పర్వదినం వంటివాటిని దృష్టిలో ఉంచుకుని 'బాద్షా' ఆడియో వేడుక వాయిదా పడింది. బహుశా మార్చి 17న ఆ ఫంక్షన్ జరిగే అవకాశం ఉంది. త్వరలోనే ధృవీకరిస్తాం. మా వైపు నుంచి జాప్యం ఏమీలేదు. పోలీసు శాఖ విజ్ఞప్తి వల్లే ఈ ఆలస్యం. అయితే మహాశివరాత్రి (మార్చి 10)కి ఓ సాంగ్ ట్రైలర్తో పాటు ఓ మైండ్బ్లోయింగ్ టీజర్ని కూడా విడుదల చేస్తున్నాం'' అని ఆయన ట్వీట్ చేశారు. ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ చిత్రంలో డాన్ కేరక్టర్లో ఎన్టీఆర్ కనిపించనున్నారు.
శివరాత్రి పండుగ రోజున ఈ పంక్షన్ కి రాష్ట్రం నలుమూలలనుంచి అభిమానులు వస్తూండటంతో, ఏదైనా ప్రమాదం జరిగే అవకాసం ఉందని పోలీసులు హెచ్చరించి వాయిదా కోరినట్లు తెలుస్తోంది. భధ్రతా కారణాల దృష్ట్యా వాయిదా పడటంతో బండ్ల గణేష్ నిరాసపడినప్పటికి మార్చి 17న ఈ ఆడియోని ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం షూటింగ్ దాదాపు ముగింపు దసకు వచ్చింది. మార్చ్లో లాంచ్ చేయబడ్డ ఈ చిత్రం శ్రీను వైట్ల దర్శకత్వంలో శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ... ''అభిమానుల నడుమ సందడిగా గీతావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఏప్రిల్ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు. తమన్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో నవదీప్ కీ రోల్ చేసారు. ఎన్టీఆర్, కాజల్లతో పాటు తెలుగు, తమిళ, హిందీ రంగాలకు చెందిన 50మందికి పైగా ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు. ఆసక్తిగొలిపే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులోని యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ప్రేక్షకుల్ని అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తాయి. 'బాద్షా'గా ఓ కొత్త ఎన్టీఆర్ని చూస్తారు.