Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
శాంతారామ్ పురస్కారానికి ఎంపికైన తెలుగు సినిమా
సిద్దార్ధ, తమన్నా జంటగా చేసిన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రాన్ని శాంతారామ్ పురస్కారం వరించింది. ఈ చిత్రం డైరక్టర్ కిషోర్ కుమార్ ఉత్తమ నూతన దర్శకుడి విభాగంలో నామినేట్ అవగా..ఉత్తమ హీరోయిన్ విభాగంలో తమన్నా నామినేట్ అయ్యింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఈ పురస్కారాలకి నామినేట్ అయిన వారు వీరిద్దరే కావడం విశేషం. ఈ నెల 21న ముంబయిలో తుది పురస్కారాల్ని ప్రకటిస్తారు. ఈ సందర్భంగా దర్శకుడు కిషోర్ కుమార్ మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. "ప్రతిష్టాత్మకమైన శాంతారామ్ పురస్కారాలకి నామినేట్ అయ్యే దశ వరకూ వెళ్లడం ఎంతో ఆనందంగా ఉంది.'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమా సున్నితమైన భావోద్వేగాల్ని పండించడంతో ఇది అందరికీ నచ్చింది. త్వరలోనే దీన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నాం. రాజశ్రీ సంస్థతో కలిసి సురేష్ బాబు, నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తారు. వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలవుతుంద"న్నారు.
ఇక ఈ చిత్రాన్ని ఆది, లక్ష్యం వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించారు. ప్రస్తుతం ఆయన వెంకటేష్ హీరోగా గంగ..ది డాన్ అనే చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అమ్మ రాజశేఖర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం సిద్దార్ధ..కె.రాఘవేంద్రరావు కుమారుడు కె.సూర్య ప్రకాశ్ దర్శకత్వంలో యోధ అనే చిత్రంలో చేస్తున్నారు. సోషియో పాంటసీగా రూపొందే ఈ చిత్రంలో కమల్ కూతరు శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక తమన్నా తమిళ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే హ్యాపీడేస్ లో తనతో చేసిన వరుణ్ సందేశ్ సరసన గీతా ఆర్ట్స్ లో సుకుమార్ దర్శకత్వంలో చేయబోతోంది.