Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'శ్రీరామదాసు' నిర్మాత నెక్ట్స్ ఏసు చరిత్ర
గతంలో బాలకృష్ణతో 'విజయేంద్రవర్మ', నాగార్జునతో 'శ్రీరామదాసు' నిర్మించిన ఆదిత్య ప్రొడక్షన్స్ సంస్థ కొండా కృష్ణంరాజు తాజాగా ఏసు క్రీస్తు జీవిత చరిత్రపై సినిమా చేయనున్నారు. జెకె.భారవి కథను సమకూర్చిన ఈ చిత్రం ఆంగ్లంతోపాటు ఆంగ్లంతోపాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ నిర్మించనున్నారు.ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరక్షన్ చేస్తున్నారు. అలాగే బాల నటులతోనే ఈ చిత్రాన్ని నిర్మించటానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ కథలో స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ లో కనపడనున్నారు. ఇజ్రాయెల్, ఇటలీ దేశాల్లో చిత్రీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈస్టర్ సందర్భంగా ఈ నెల 4న లాంఛనంగా చిత్రీకరణ మొదలవుతుంది. బాలల చిత్రంలో అగ్ర తారల పాత్రలేమిటనే విషయాన్ని చిత్ర వర్గాలు సీక్రెట్ గా ఉంచారు.
దైవ కుమారుడిగా క్రీస్తు రాక నుంచి మొదలయ్యే ఈ కథలో పలు కొత్త విషయాల్ని చూపించబోతున్నారు. ఇందుకోసం దర్శకరచయితలు క్రైస్తవ మత పెద్దలతో చర్చలు సాగించారు. 10 నుంచి 14 సంవత్సరాలలోపు బాలల్నే అన్ని చారిత్రక పాత్రలకీ ఎంపిక చేస్తున్నారు. క్రీస్తు, మేరీ మాత పాత్రలకు ప్రముఖుల పిల్లల్ని తీసుకున్నట్లు తెలిసింది. 14 సంవత్సరాల బాలుణ్ని 30 సంవత్సరాల క్రీస్తుగా చూపించేందుకు ప్రత్యేక మేకప్ సూత్రాల్ని పాటించబోతున్నారు. అమితాబ్ బచ్చన్ కి 'పా'లో మేకప్ చేసిన హాలీవుడ్ నిపుణుడు క్రిస్టీన్ టిన్స్లే బృందం ఈ సినిమాకు పని చేస్తుంది. టిన్స్లే గతంలో 'పాసన్ ఆఫ్ క్రైస్ట్'కి పని చేశారు. ఆయన ఆస్కార్ పురస్కారం కూడా పొందారు.