Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆసక్తి రేకెత్తిస్తున్న మహేష్ బాబు సీఎం పాత్ర.. కేవలం 15 నిమిషాలు మాత్రమే!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. శుక్రవారం ఏప్రిల్ 20 న ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. స్వయంగా సూపర్ స్టార్ మహేష్ రంగంలోకి దిగి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
మహేష్ బాబు ఈ చిత్రంలో రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతుండడంతో ఆ ఉత్కంఠ అభిమానుల్లో ఎక్కువైపోతోంది. మహేష్ రాజకీయ నాయకుడిగా ఎలా నటించాడు, ముఖ్యమంత్రిగా ఎలాంటి పోరాటాలు చేస్తాడు అనే విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.
తాజాగా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ ముఖ్యమంత్రి పాత్ర గురించి ఆసక్తి కరమైన విషయాన్ని వెల్లడించాడు. మహేష్ బాబు మొదటి 15 నిమిషాల వరకే సాధారణంగా కనిపిస్తాడని ఆతరువాత సీఎం ఐపోతాడని అన్నారు. ఇక సినిమా చివరి వరకు మహేష్ ముఖ్యమంత్రిగానే కనిపిస్తాడని కొరటాల ఉత్కంఠ పెంచేశారు.