Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జనతా గ్యారేజ్.. కావాలనే కాంట్రవర్సీ చేశారు.. కోట శ్రీనివాసరావు!
టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రణామాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శ్రీరెడ్డి లేవననెత్తిన తెలుగు వారికి అవకాశాలు, కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి పోరాటం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విషయం అనేక వివాదాలతో పక్కదారి పట్టింది. కాగా ప్రముఖ నటుడు కోటశ్రీనివాసరావు తెలుగు వారికి అవకాశాలు కల్పించాలని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కోట వ్యాఖ్యలు చర్చనీయాంశగా మారాయి కూడా.
జనతా గ్యారేజ్ చిత్ర విషయంలో కోట అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోట ఈ విషయం గురించి మాట్లాడారు. తన వ్యాఖ్యలని కావాలనే వివాదం చేసారని కోట వాపోయారు. జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్ లాల్ బాగా చేసారని చాలా మంది చెప్పారు. మోహన్ లాల్ బాగా చేయడం ఏంటి. ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని తాను అన్నానని, ఆ మాటలని పట్టుకుని జనతా గ్యారేజ్ చిత్రంపై కోటా సంచలన వ్యాఖ్యలు అంటూ మీడియా వారు వివాదం చేసారని కోట అన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు వారికి అవకాశాలు కల్పించాలని తాను గత 12 సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాని అన్నారు. పరభాషా నటుల్ని తీసుకోవడంలో తప్పులేదని, కానీ నటన అంటే తెలియని వారిని ఇక్కడినుంచే తీసుకుని వచ్చి పెడుతున్నారని అన్నారు. తెలుగు సినిమాకు ఈ దుస్థితి ఏంటని తనకు అనిపిస్తుందని అన్నారు.