Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జనతా గ్యారేజ్.. కావాలనే కాంట్రవర్సీ చేశారు.. కోట శ్రీనివాసరావు!
టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రణామాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శ్రీరెడ్డి లేవననెత్తిన తెలుగు వారికి అవకాశాలు, కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి పోరాటం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విషయం అనేక వివాదాలతో పక్కదారి పట్టింది. కాగా ప్రముఖ నటుడు కోటశ్రీనివాసరావు తెలుగు వారికి అవకాశాలు కల్పించాలని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కోట వ్యాఖ్యలు చర్చనీయాంశగా మారాయి కూడా.
జనతా గ్యారేజ్ చిత్ర విషయంలో కోట అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోట ఈ విషయం గురించి మాట్లాడారు. తన వ్యాఖ్యలని కావాలనే వివాదం చేసారని కోట వాపోయారు. జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్ లాల్ బాగా చేసారని చాలా మంది చెప్పారు. మోహన్ లాల్ బాగా చేయడం ఏంటి. ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని తాను అన్నానని, ఆ మాటలని పట్టుకుని జనతా గ్యారేజ్ చిత్రంపై కోటా సంచలన వ్యాఖ్యలు అంటూ మీడియా వారు వివాదం చేసారని కోట అన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు వారికి అవకాశాలు కల్పించాలని తాను గత 12 సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాని అన్నారు. పరభాషా నటుల్ని తీసుకోవడంలో తప్పులేదని, కానీ నటన అంటే తెలియని వారిని ఇక్కడినుంచే తీసుకుని వచ్చి పెడుతున్నారని అన్నారు. తెలుగు సినిమాకు ఈ దుస్థితి ఏంటని తనకు అనిపిస్తుందని అన్నారు.