twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగచైతన్య జోడీ ఆ పిల్లా?

    By Staff
    |

    Naga Chaitanya
    ఫిల్మ్ సర్కిల్స్ లో ఎక్కడ విన్నా గత రెండు రోజులుగా నాగచైతన్య జోడీ ఆ పిల్లా అనే టాపిక్ నడుస్తోంది. ఇంతకీ ఎవరా పిల్లా..ఏమా కథ అని ఎంక్వైరీ చేస్తే...నాగార్జున తన కుమారుడు నాగ చైతన్య ను హీరోగా పరిచయం చేస్తూ వాసు వర్మ అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇప్పటివరకూ సస్పన్స్ గా ఉండిపోయింది. అయితే చైతన్య సినిమాలో నటించే హీరోయిన్‌ను దిల్‌రాజు ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు శ్వేతా ప్రసాద్ అని అంటున్నారు.

    కొత్త బంగారు లోకం హిట్ టాక్ తెచ్చుకున్నప్పటినుండీ ఆ సినిమాలోని హీరోయిన్ గాశ్వేతా ప్రసాద్ నే ఈ చిత్రంలో ఫిక్స్ చేసారని వినిపిస్తున్నాయి. అందులోనూ కొత్త బంగారు లోకం నిర్మాత దిల్ రాజు సక్సెస్ మీట్ లో ఆమెపై స్పెషల్ కన్సర్న్ చూపటంతో ఈ ఊహలకు రెక్కలొచ్చినట్లయింది. అందులోనూ నాగచైతన్య చిత్రానికీ రాజు నిర్మాత కావటం మరో కారణం. అయితే ప్రెష్ అమ్మాయిని తన కుమారుడు ప్రక్కన చేయిద్దామని ఆలోచిస్తున్ననాగార్జున ఈ ప్రపోజల్ కి ఒప్పుకున్నాడా..ఒప్పుకుంటాడా... అనేది అందరినీ ఆలోచింప చేస్తోంది. ఇక దిల్ రాజు ఎంపిక బాగానే ఉంటుందనీ... లేతగా ఉండే నాగచైతన్య ఫేస్ కి ఆమె అయితేనే బాగుంటుందని ఈ టాపిక్ కి అంతా ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.

    ఇక పూజా కార్యక్రమాలు మాత్రం ఇటీవలే అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ మూడో తేదీ నుంచి హైదరాబాద్‌లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలను పండించేందుకు నాగచైతన్య గుర్రపు స్వారీ, బైక్ ఛేజింగ్‌‌లను నేర్చుకుంటున్నారని తెలిసింది. అదీ సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X