twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దసరాకి 'కొత్త బంగారు లోకం'

    By Staff
    |

    Kotha Bangaru Lokam
    వరుణ్‌సందేశ్‌, శ్వేతా ప్రసాద్‌ జంటగా శ్రీకాంత్‌ అడ్డాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ 'దిల్‌'రాజు నిర్మిస్తున్నచిత్రం 'కొత్త బంగారులోకం'. ఈ సినిమాని విజయదశమికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్ర ఛాయాగ్రాహకుడు చోటా కె.నాయుడు మాట్లాడుతూ 'ఆరోజులలో విడుదలయిన 'మరో చరిత్ర' సినిమా చూసి నేను ఎంతో ఇన్‌స్పైర్‌ అయ్యాను. అటువంటి గొప్ప ప్రేమకథకు పనిచేయాలనే నా కోరిక ఈ సినిమాతో తీరిందన్నారు.

    నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..ఒక మంచి సినిమా తయారు కావాలంటే మంచి కథ, మంచి బేనరు, టీమ్‌ కావాలి. అవన్నీ ఈ సినిమాకి అమిరాయి' అన్నారు. అలాగే ఈ సినిమాని కాంపాక్ట్‌ బడ్జెట్‌లో తీయాలని మొదట అనుకున్నాం. కొత్త వాళ్లతో, సాంకేతిక నిపుణులతో సినిమాని ప్రారంభించి 60 రోజులలో పూర్తి చేయాలనుకున్నాం. అయితే దర్శకుడు కొత్త కనుక సీనియర్‌ కెమెరామన్‌ అయితే అతనికి హెల్ప్‌ అవుతుందని చోటాని బుక్‌ చేశాం. అలాగే 'హ్యాపీడేస్‌' చిత్రం పాటలు విని సంగీత దర్శకుడిగా మిక్కీ .జె.మేయర్‌ను, ఆ సినిమాలో హీరో వరుణ్‌సందేశ్‌ని ఎంపిక చేశాం.

    కథ డిమాండ్‌ చేసిన విధంగానే మిగిలిన ఆర్టిస్టులను ఎంపిక చేశాం. సాధారణంగా ప్రతి సినిమాకు షూటింగ్‌ స్పాట్‌లో ఉండే నేను ఈ చిత్రం షూటింగ్‌కు మాత్రం ఎక్కువగా వెళ్లలేదు. బాధ్యత అంతా చోటా, శ్రీకాంత్‌లకే అప్పచెప్పాను. సినిమా బాగా వచ్చింది. విజయదశమి సందర్భంగా అక్టోబరు 9న విడుదల చేస్తున్నాం.'అన్నారు. ఈ సమావేశంలో సహ నిర్మాతలు శిరీష్‌, లక్ష్మణ్‌ కూడా పాల్గొన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X