అక్టోబర్ 14న ‘కొత్త కొత్తగా ఉన్నది’
శ్రీ మహాలక్ష్మి ఇన్నొవేటివ్స్ నిర్మించిన చిత్రం కొత్త కొత్తగా వున్నది. సమర్ కథానాయకుడు. అక్షిత, కిమయ నాయికలు. పేర్ల ప్రభాకర్, తోట గోపాల్ నిర్మాతలు. గుండేటి సతీష్కుమార్ దర్శకుడు. ఈ చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిర్మాత మాట్లాడుతూ ఆడియోకి మంచి స్పందన వచ్చింది. అక్టోబర్ 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హీరో, హీరోయిన్లు దర్శకుడు కూడా కొత్తవారే. చాలా మంది సినిమాను చూసి ఫ్రెష్ ఫీల్తో ఉందని అన్నారు. కచ్చితంగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే చిత్రమవుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications